టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చాలా తెలివిగా తాను చేస్తున్న సినిమాలలో తన సొంత బ్యానర్లను ఇన్వాల్వ్ చేస్తూ అనేక లాభాలు సంపాదిస్తున్నారు. ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన 'అల వైకుంఠపురంలో' సినిమా చిత్ర నిర్మాణ భాగస్వామ్యంలో గీతా ఆర్ట్స్ ని భాగస్వామిగా అల్లు అర్జున్ తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ఇదేవిధంగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న 'పుష్ప' సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో తన బంధువులను ఒకరిని పార్టనర్ గా బన్నీ పెట్టినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్. సినిమాకి సంబంధించి బడ్జెట్ వ్యవహారాలను బన్నీ దగ్గరుండి చాలా జాగ్రత్తగా ఆరా తీస్తున్నట్లు ఇన్వాల్వ్ అవుతున్నట్లు ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది.

 

ఇదిలాఉండగా త్రివిక్రమ్ సినిమా 'అలా వైకుంఠపురం లో' సినిమా కి షేర్ 150కోట్లు వచ్చినప్పుడు 'పుష్ప' సినిమాకి ఓ బడ్జెట్ అంచనా వేయడం జరిగింది. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో అనుకున్న బడ్జెట్ తో సినిమా చేస్తే రాబోయే రోజుల్లో భయంకరంగా నష్టం వచ్చే అవకాశం ఉందని, తిరిగి మళ్ళీ సినిమా విడుదల చేసి రాబట్టే లాంటి పరిస్థితులు లేవని చిత్ర యూనిట్ భావిస్తోందట. దీంతో సినిమా బడ్జెట్ విషయంలో అల్లు అర్జున్ ఇన్వాల్వ్ అయ్యి తగ్గించే కార్యక్రమం స్టార్ట్ చేసినట్లు ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి.

 

దీంతో బన్నీ ఇన్వాల్వ్ మెంట్ కు డైరెక్టర్ సుకుమార్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారట. కాగా సినిమా లోకేషన్స్ మరియు సెట్స్ విషయంలో గతంలో లాగా కాకుండా కుదించే కార్యక్రమం సినిమా యూనిట్ దగ్గరుండి మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క సినిమాకి సంబంధించి షూటింగ్ పెద్ద జరగకపోవడంతో… ప్రజెంట్ అంచనా వేస్తున్న బడ్జెట్ సినిమాకి ప్లస్ అవుతుందని సినిమా విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: