టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గత ఏడాది  రిలీజ్ అయిన కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి నందమూరి అభిమానులను తీవ్ర నిరాశలో పడేశాయి. కాగా వాటి అనంతరం కొంత ఆలోచన చేసిన బాలయ్య, తన నెక్స్ట్ మూవీకి దర్శకత్వం వహించే బాధ్యత బోయపాటి శ్రీనుకి అప్పగించారు. ఇటీవల లాక్ డౌన్ కు ముందుకు రెండు షెడ్యూల్స్  పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మొన్న బాలయ్య పుట్టినరోజున రిలీజ్ అయి అందరి నుండి మంచి స్పందన బట్టి, సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు పెంచేసింది. బాలయ్య రెండు పవర్ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్. 

IHG

గతంలో బాలయ్య, బోయపాటిల కాంబో లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఒక దానిని మించి మరొకటి ఎంతటి గొప్ప విజయాలు అందుకున్నాయో మనకు తెలిసిందే. ఆ రెండు సినిమాల్లో కూడా బాలయ్య తన అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో పాటు అద్భుతమైన డైలాగ్స్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేసారు. ఇక ఆ రెండింటి తరువాత వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొట్టి, వారి కాంబోలో హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయం అని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా గతంలో తాను తీసిన జయ జానకి రామ సినిమాతో యావరేజ్ ని, అలానే వినయ విధేయరామ సినిమాతో ఫ్లాప్ ని మూట గట్టుకున్న బోయపాటి, ఎలాగైనా ఈ సినిమాని హిట్ చేసేలా కష్టపడుతున్నాడట. కాగా మరికొన్నాళ్లలో ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కూడా ప్రారంభం కానున్నట్లు చెప్తున్నారు. 

 

ఇంతవరకు అంతా బాగానే ఉందని, అయితే ఇప్పటికే రెండు భారీ హిట్స్ సొంతం చేసుకున్న కాంబోలో వస్తున్న ఈ మూడవ సినిమాలో ఏ మాత్రం లోపాలున్నా, రేపు రిలీజ్ తరువాత అది సినిమా టాక్ పై పడి, హ్యాట్రిక్ అవకాశాలు గల్లంతయ్యే ఛాన్స్ ఉందని, కాబట్టి దర్శకుడు బోయపాటి స్క్రిప్ట్ లో ఏ మాత్రం లోపాలు లేకుండా అందరి అంచనాలు అందుకునేలా కథ, కథనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే హ్యాట్రిక్ తప్పక వరిస్తుందని కొందరు అంటున్నారు. మరి ఈ సినిమా ఎంత మేర విజయం సాధిస్తుందో తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: