రాజకుమారుడు తో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు, ఆ సినిమాతో సూపర్ సూపర్ హిట్ కొట్టడంతో, అక్కడి నుండి ఆయనను అభిమానులు, ప్రేక్షకులు ముద్దుగా ప్రిన్స్ అని పిలవడం మొదలెట్టారు. అయితే ఆపై వచ్చిన మురారి, ఒక్కడు సినిమాలు మహేష్ బాబు కెరీర్ లో ఎంతో గొప్ప విజయాలు నమోదు చేయడం తో పాటు ఆయన ఇమేజ్ ని మరింతగా పెంచాయి. అనంతరం వచ్చిన అతడు సినిమా కూడా సూపర్ హిట్ కొట్టి మహేష్ ఇమేజ్ ని బాగా పెంచింది. ఇకపోతే వాటి తరువాత వచ్చిన పోకిరి సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి, మహేష్ బాబుకు సూపర్ స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. 

IHG

సినిమా తరువాత హీరో మహేష్ బాబుతో పాటు ఆ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ ఇలియానాల క్రేజ్ కూడా అమాంతం ఒక్కసారిగా మారిపోయింది. ఇక అక్కడి నుండి కెరీర్ ని మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న సూపర్ స్టార్ మహేష్, ఇటీవల వరుసగా మూడు విజయాలతో కెరీర్ పరంగా హ్యాట్రిక్ ని సొంతం చేసుకున్నారు. ఇక అతి త్వరలో పరశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించనున్న సర్కారు వారి పాట సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. బ్యాంకింగ్ ఫ్రాడ్ ల నేపథ్యంలో పలు కమర్షియల్ హంగులతో సాగనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇప్పటికే కీర్తి సురేష్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే, ఈ సినిమాలో ఒక కీలకమైన ఫిమేల్ రోల్ లో మహేష్ తో కలిసి పోకిరి లో జోడి కట్టిన ఇలియానా నటించనున్నట్లు చెప్తున్నారు. 

 

సినిమాలో ఆమె పాత్రకు కొన్ని సీన్స్ తో పాటు ఒక పాట కూడా ఉండనున్నట్లు టాక్. ఇప్పటికే ఆ రోల్ విషయమై దర్శకుడు పరశురామ్ ఇలియానాతో సంప్రదించగా ఆమె చేయడానికి అంగీకరించినట్లు చెప్తున్నారు. అన్ని కలిసి వస్తే మరొక్కసారి ఆమె మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ ఉందంటున్నారు. అదే నిజమైతే మరొక్కసారి ఈ జంటను ఎన్నో ఏళ్ల తరువాత మరొక్కసారి తెరపై చూడవచ్చన్నమాట. మరి ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి వాస్తవాలు వెల్లడికావాలంటే సర్కారు వారి పాట సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.... !! 

మరింత సమాచారం తెలుసుకోండి: