మెగా హీరో అల్లుఅర్జున్ తన అప్ కమింగ్ మూవీపై ప్రత్యేక శ్రద్ధను పెడుతున్నాడు. ఈ మూవీకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. జులాయి మూవీ తరువాత మళ్ళీ ఆ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఏప్రిల్ 10న త్రివిక్రమ్, అల్లుఅర్జున్ మూవీకు ముహర్తపు షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జాలాయికు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై త్రివిక్రమ్, అల్లుఅర్జున్ తో పాటు చిత్ర యూనిట్ అంతా నమ్మకాలు పెట్టుకుంది. హారికా & హాసిని బ్యానర్ లపై ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మించనున్నారు. వీరు ముగ్గురూ కలిసి గతంలో చేసిన జులాయి సినిమా అల్లఅర్జున్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కి స్థానం వుందని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. మే నుండి షూటింగ్ మొదలుకానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. అల్లుఅర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ మరో సక్సెస్ ను సాధిస్తుందా? ఈ టాపిక్ మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: