అల్లు అర్జున్ ఆశలకు కరోనా గండి కొడుతుందా.. పాన్ ఇండియన్ మూవీతో అదరగొట్టాలన్న బన్నీ ప్లాన్స్ కు బ్రేకులు పడుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పుష్పతో నార్త్ లోనూ స్టార్డమ్ తెచ్చుకోవాలనుకున్న అల్లు అర్జున్ ప్రణాళికలను లాక్ డౌన్ దెబ్బతీసిందనే ప్రచారం జరుగుతోంది. 

 

అల్లు అర్జున్ పుష్ప సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ మూవీతో మార్కెట్ రేంజ్ పెంచుకోవాలని, సదరన్ స్టార్ నుంచి పాన్ ఇండియన్ హీరోగా ఎదగాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ మూవీ ఫస్ట్ లుక్ ని 5భాషల్లో రిలీజ్ చేశాడు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడలో పోస్టర్స్ రిలీజ్ చేసి భారీ టార్గెట్ తో బరిలో దిగుతున్నట్టు హింట్ ఇచ్చాడు. 

 

సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి పుష్ప సినిమాను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా డిజైన్ చేశారు. నార్త్ మార్కెట్ కోసం బాలీవుడ్ స్టార్స్ ని తీసుకోవాలనుకున్నారు. దిశా పఠానీతో ఐటమ్ సాంగ్ చేయించాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఆలోచనలు మారిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. 

 

పుష్ప షూటింగ్ ఊపందుకునే టైమ్ లో కరోనా లాక్ డౌన్ వచ్చింది. ఇండస్ట్రీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. దీంతో టాలీవుడ్ నిర్మాతలంతా కాస్ట్ కటింగ్ గురించి మీటింగ్ లు పెట్టారు. పుష్ప కూడా ఇలాగే ఖర్చులు తగ్గించే ఆలోచనలో ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే ఐటం సాంగ్ కి దిశాని కాకుండా.. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ని తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. 

 

స్ట్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నెన్నో కలలు కన్నాడు. అలా ఉండాలి ఇలా ఉండాలి.. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగిపోవాలని ఉవ్విళ్లూరాడు. కానీ కరోనా అల్లు అర్జున్ ఆశలకు గండికొట్టింది. పుష్పతో ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించాలని భావించిన ఈ హీరో.. ఆశించిన స్థాయిలో పనులు జరుగడం లేదు. ఇంకేముందీ కాస్త డిసప్పాయింట్ అయిపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: