టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. పవన్ సినిమా వస్తుంది అంటే చాలు ఆయన ఫాన్స్ కి ఒక రేంజ్ లో పండగ ఆయన తో సినిమా చేసే దర్శక నిర్మాతలకు కాసుల వర్షం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దాదాపు రెండేళ్ళ తర్వాత ఒక సినిమాను వకీల్ సాబ్ అనే టైటిల్ తో చేస్తున్నన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే టాలీవుడ్ లో చాలా ఆసక్తిగా చదివే పరిస్థితి అయితే ఉంది అనే మాట వాస్తవం. ఈ సినిమా తర్వాత ఆయన క్రిష్ తో ఒక సినిమాను చేస్తున్నారు. 

 

సినిమా దాదాపుగా లాంచ్ కూడా చేసారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఈ లాక్ డౌన్ లో ఈ సినిమా గురించి చాలా ప్రచారమే టాలీవుడ్ లో జరిగింది అనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే వారి గురించి చాలానే వార్తలు వచ్చాయి ఈ లాక్ డౌన్ లో అనే మాట వాస్తవం. హీరోయిన్ గా అనుష్క లేదా శృతి హాసన్ లేదా సాయి పల్లవి లేదా కీర్తి సురేష్... లేదా నయనతార అంటూ ఏదోక వార్త వస్తూనే ఉంది అనే చెప్పాలి. ఇక టాలీవుడ్ లో కూడా ఈ వార్తల మీద ప్రత్యేకంగా దృష్టి సారించి మరీ చదివిన పరిస్థితి అయితే ఉంది అనే చెప్పాలి.

 

పవన్ కూడా ఈ సినిమా మీద చాలానే ఫోకస్ చేసారు అని ఈ సినిమాను ఆయన విడుదల చేయడానికి చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అని క్రిష్సినిమా కోసం బాలీవుడ్ నటులను తీసుకునే అవకాశం ఉంది అనే ప్రచారం  జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: