టాలీవుడ్ లో ఇప్పుడు చాలా వరకు స్టార్ హీరోల సినిమాల విషయంలో నిర్మాతలు దర్శకులు చాలా వరకు  జాగ్రత్తలు తీసుకుని సినిమాలను ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలు చెయ్యాలి అంటే చాలు భయపడే విధంగా ఉన్నాయి పరిస్థితులు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు మన తెలుగు లో రెండు మూడు సినిమాలు స్టార్ హీరోలవి పూర్తి అయితే విడుదలకు సిద్దంగా ఉన్నాయి గాని అవి ఇంకా ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశాలు మాత్రం కనపడటం లేదు. ఇప్పుడు మహేష్ బాబు విషయంలో సర్కారు వారి పాట నిర్మాత దర్శకులు ఆలోచనలో పడ్డారు. 

 

ఈ సినిమాను వేగంగా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసినా సరే సినిమాను ఎప్పుడు విడుదల చెయ్యాలి అనే దాని మీద వారికి ఏమీ అర్ధం కావడం లేదు అని దర్శకుడి తో మాట్లాడినా సరే సినిమా విడుదల తేదీ అనేది ఇప్పట్లో వద్దు అని ఇప్పుడు విడుదల చేసినా సరే అసలు ఏ విధంగా కూడా బయటపడే అవకాశం లేదు అని దాదాపు రెండేళ్ళ వరకు గ్యాప్ తీసుకోవడం మంచిది అనే సూచన చేసారు అని సమాచారం. మరి అది ఎంత వరకు నిజం అనేది ఇంకా స్పష్టంగా తెలియదు గాని దీనిపై మాత్రం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ప్రచారమే  జరుగుతూ వస్తుంది. 

 

లాక్ డౌన్ లో ఇప్పుడు జనాలకు కూడా ఈ సినిమా విషయంలో అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాను అసలు ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అనేది అర్ధం కావడం లేదు జనాలకు. మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుంది అనేది చూడాలి. కాగా ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామి నటించే అవకాశం ఉంది అనే దాని మీద వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: