సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు స్మాల్ స్క్రీన్ పైన కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. టి.ఆర్.పి రేటింగ్స్ లో టాప్ 3 పొజిషన్ లో ఇది నిలిచింది. కింగ్ నాగార్జున శ్రీరామదాసు 24 రేటింగ్ తో టాప్ ప్లేస్ లో ఇప్పటికి ఉండగా సెకండ్ ప్లేస్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన టెంపర్ 23.5 రేటింగ్ తో రికార్డ్ క్రియేట్ చెసింది.

 

ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా మార్చి చివరి వారంలో మొదటిసారి వరల్డ్ ప్రీమియర్ షో వేయగా అప్పుడు 23.4 రేటింగ్ తెచ్చుకుంది. ఈ రేటింగ్ తో మహేష్ సరిలేరు నీకెవ్వరు స్మాల్ స్క్రీన్ టి.ఆర్.పి రేటింగ్ లో టాప్ 3లో నిలిచింది. ఇక సరిలేరు నీకెవ్వరు మొదటిసారే కాదు రెండోసారి కూడా రికార్డ్ టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది. ఈసారి 17.4 రేటింగ్ తో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు మహేష్. మహేష్ నటించిన మహర్షి సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకోగా స్మాల్ స్క్రీన్ పై మాత్రం డిజాస్టర్ అయ్యింది.

 

సరిలేరు నీకెవ్వరు మాత్రం మొదటిసారి టాప్ 3 టి.ఆర్.పిలో నిలబడగా సెకండ్ టైం కూడా మంచి రేటింగ్ తెచ్చుకుంది. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ టైం లో జనాలందరు ఇల్లలోనే ఉంటున్నారు. బయటకు వెళ్లే వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అందుకే ఇంట్లో ఉంటూ సరిలేరు నీకెవ్వరు మరోసారి ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు.                    

మరింత సమాచారం తెలుసుకోండి: