ఎన్నాళ్లనుండో ఎదురుచూస్తున్న రాజమౌళి, మహేహ్ కాంబినేషన్ లో సినిమాకు రంగం సిద్ధం అవుతుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తను చేసేది మహేష్ సినిమానే అని కన్ ఫర్మ్ చేశాడు రాజమౌళి. అసలైతే ట్రిపుల్ ఆర్ సినిమా ఈ ఇయర్ లోనే రిలీజ్ అనుకోగా షూటింగ్ కు వివిధ కారణాల వల్ల అంతరాయం ఏరపడటం వల్ల అది వాయిదా పడింది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలున్నాయి. ఇక మహేష్ తో రాజముళి చేసే సినిమాపై ఇప్పటినుండే వార్తలు మొదలయ్యాయి. వీరి కాంబినేషన్ లో జేంస్ బాండ్ తరహా సినిమా వస్తుందని అంటున్నారు.

 

అయితే రాజమౌళితో సినిమా అంటే అంత ఈజీ ఏం కాదు ఎలా లేదన్నా సరే రెండేళ్లు రాసిచ్చేయాలి. ఆర్.ఆర్.ఆర్ ను వన్ ఇయర్ లో పూర్తి చేయాలని అనుకున్నా అది కూడ రెండేళ్లు పడుతుంది. ఇక మహేష్ సినిమా కూడా స్క్రిప్ట్ ఫైనల్ అవడం.. కాస్టింగ్, లొకేషన్స్ ఇలా ఎలా లేదన్నా 2022 తర్వాత మొదలయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎలా లేదన్నా మరో రెండేళ్లు ఉందన్నమాట. రాజమౌళి సినిమా ఓకే చేసినా మహేష్ మధ్యలో బేషుగ్గా రెండు సినిమాలు చేసుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురాం డైరక్షన్ లో సరారు వారి పాట సినిమా చేస్తున్నాడు.

 

సినిమా తార్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా ఉండొచ్చని అంటున్నారు. అంతేకాదు పక్కన పెట్టిన వంశీ పైడిపల్లి సినిమాని కూడా లైన్ లోకి తెచ్చేలా ఉన్నారు. సో రాజమౌళి సినిమాకు ఎలాగు 2 ఇయర్స్ ఇచ్చేయాలి కాబట్టి ఈలోగా స్పీడ్ స్పీడ్ గా రెండు మూడు సినిమాలు చేసేయాలన్నది మహేష్ ఆలోచన. అయితే మహేష్ ప్లాన్ బాగున్నా అనుకున్న విధంగా షూటింగ్ జరుగుతుందో లేదో చూడాలి.        

మరింత సమాచారం తెలుసుకోండి: