అనసూయ, రష్మి గౌతమ్ ఇద్దరికీ బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం బుల్లితెర లో టాప్ యాంకర్స్ గా కొనసాగుతున్నారు ఇద్దరు. అప్పటివరకు సాదాసీదా యాంకర్ గా ఉన్నప్పటికీ జబర్దస్త్ షో ద్వారా ఎంతగానో ఎంతగానో గుర్తింపు  సంపాదించారు. ఈ ఇద్దరు యాంకర్లకు  కూడా జబర్దస్త్ ద్వారానే క్రేజ్  వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక జబర్దస్త్ కాకుండా వీరిద్దరు వేరే షోలు మాత్రం చేయడం. మొదటి నుంచి కేవలం జబర్దస్త్ ని మాత్రమే అంటిపెట్టుకుని ఉన్నారు. అయితే మొదట జబర్దస్త్ మాత్రమే ఉండగా అనసూయ కొన్ని రోజులపాటు జబర్దస్త్ దూరమైంది. ఆ సమయంలోనే రష్మీ జబర్దస్త్ యాంకర్ గా అవతారమెత్తింది. ఈ క్రమంలోని రష్మీ కూడా ఎంతగానో క్రేజ్ సంపాదించింది...



 ఇక ఆ తర్వాత అనసూయ మళ్ళీ జబర్దస్త్ లోకి రావడానికి సిద్ధంగా ఉండగా... అటు రష్మీ ని తీసేయలేక ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే సరికొత్త షో  ప్రారంభించింది జబర్దస్త్ యాజమాన్యం. అయితే జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ రెండు  రోజులు ఈ  షో వచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఎంతగానో ఎంటర్టైన్  అయ్యారు. దీంతో టాప్ రేటెంతో దూసుకుపోయాయి ఈ  రెండు షోలు. అయితే ఇటీవలే కరోనా  వైరస్ లాక్ డౌన్ సడలింపులు తర్వాత జబర్దస్త్ మళ్లీ పున ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జబర్దస్త్ షో లో కొన్ని టీమ్స్ కూడా చేంజ్ అయ్యాయి.


అయితే ఇటీవలే అనసూయకు రష్మి గౌతమ్ భారీ షాక్ ఇచ్చింది. అది ఎలా అనుకుంటున్నారా.. అనసూయ హోస్ట్ చేసే జబర్దస్త్ కంటే రష్మి గౌతమ్ హోస్ట్ చేసే ఎక్స్ ట్రా జబర్దస్త్ కి ఎక్కువ టిఆర్పి వచ్చినట్లు  తెలుస్తుంది. గత రెండు వారాల నుంచి అనసూయ జబర్దస్త్ కంటే రష్మి గౌతమ్ ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎక్కువ టి ఆర్ పి లు వస్తున్నాయట. అయితే దీనికి కారణం ఏదైనప్పటికీ ప్రస్తుతం అనసూయ ను వెనక్కినెట్టి రష్మీ ముందుకు వచ్చేసింది అని చెప్పాలి. మరి ముందు ముందు రష్మీ ఇదే జోరు  కొనసాగిస్తుందా లేదా చూడాలి మరి.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: