మన తెలుగు లో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే హీరోలకు మినహా ఎవరికి కూడా భారీగా ఖర్చు చేసే అవకాశం అనేది దాదాపుగా కనడటం లేదు అనే చెప్పాలి. స్టార్ హీరోలు చాలా వరకు కూడా తగ్గించుకుని సినిమాలు చేస్తున్నారు. అగ్ర హీరోలు అయినా చిన్న చిన్న హీరోలు అయినా సరే దాదాపు అదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే మన తెలుగు లో స్టార్ హీరోలు చాలా వరకు కూడా తమ బడ్జెట్ విషయంలో దర్శక నిర్మాతలకు చాలా వరకు తగ్గే ఉంటాము అని చెప్తున్నారు. 

 

అయితే ఈ సమయంలో వారు పెడుతున్న ఒక షరతు విషయంలో మాత్రం కాస్త అసహనంగా ఉన్నాయి టాలీవుడ్ వర్గాలు.  అది ఏంటీ అంటే తమ సినిమాల కోసం బాలీవుడ్ విలన్ లు కావాలి అని పాన్ ఇండియా అయితే అలాగే ఉండాలి అని చెప్తున్నారు అని తెలుస్తుంది.  ఇటీవల మహేష్ బాబు అరవింద్ స్వామిని అడిగాడు అని కాని సర్కారు వారి పాట నిర్మాతలు మాత్రం ఏమీ చెప్పలేని పరిస్థితి లో ఉన్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇక మహేష్ కూడా ఎంత చెప్పినా సరే వినడం లేదు అని టాక్. 

 

ఇప్పుడు దాదాపుగా మహేష్ బాబు సర్కారు వారి పాట కోసం ఏడాది పైగా సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఒకవేళ ఆ సినిమా పాన్ ఇండియా కాదు అంటే మాత్రం తగ్గే సూచనలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. ఇక ఎంత వరకు నిజం ఏంటీ అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక పుష్ప సినిమాలో కూడా బాలీవుడ్ విలన్ ని అల్లు అర్జున్ అడిగాడు అని టాక్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: