ఇప్పుడు సినిమాల షూటింగ్ విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి అనేది అర్ధం కాని పరిస్థితి సర్వత్రా నెలకొంది. సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు చాలా వరకు ఆశలు పెట్టుకున్నా సరే సినిమాలను దాదాపుగా షూట్ చేసే వాతావరణం కనపడటం లేదు అనే చెప్పాలి. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఇప్పుడు దాదాపుగా షూట్ చేసే అవకాశం లేదు అనే చెప్పాలి. మన తెలుగు లో చాలా వరకు పాన్ ఇండియా సినిమాలు లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

 

స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా ఈ కరోనా దెబ్బకు ఆగిపోయాయి. భారీగా పెట్టుబడి పెట్టిన వారు కూడా ఈ పరిణామాలను చూసి కాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల కోసం భారీగా పెట్టుబడి పెట్టిన నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త తెలుగు లో హాట్ టాపిక్ గా మారింది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే సినిమాల విషయంలో స్టార్ హీరోలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. పాన్ ఇండియా సినిమాలను వద్దు అని చెప్పారు అని వార్తలు వస్తున్నాయి. 

 

నానీ లాంటి చిన్న హీరో కూడా పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం వస్తే వద్దు అని చెప్పాడు అని టాక్. మరి అది నిజమా కదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే పాన్ ఇండియా అంటే లేట్ అయ్యే అవకాశం ఉంది అని అప్పుడు నిర్మాతలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది అని అందుకే వద్దు అని చెప్పారు అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: