దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. కరోనా వైరస్ నుండి రాజకీయ నాయకులు, పోలీసులు మరియు చికిత్స అందిస్తున్న వైద్యులు ఎవరు తప్పించుకోలేక పోతున్నారు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని కనికరించడం లేదు కరోనా వైరస్. చాలా వరకు దేశంలో కరోనా భారీస్థాయిలో వ్యాప్తి చెందినట్లు వైద్య నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి మరియు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ కి 77 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఆయనకి కరోనా పాజిటివ్ అని తేలటం తో కుటుంబ సభ్యులు అందరికీ కరోనా టెస్ట్ చేయడం తో ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు రిపోర్టు బయటపడింది.

 

ఈ విషయాన్ని ముంబైలోని నానావతి హాస్పిటల్ వైద్య బృందం నిర్ధారించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందుగా అమితాబచ్చన్ తనకి కరోనా సోకింది అని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ని టెస్టులు చేయించడం జరిగింది అంటూ తెలిపారు. తాజాగా రిపోర్టులు రావడంతో అభిషేక్ బచ్చన్ కి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా జయాబచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ యొక్క రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది.

 

గత పది రోజులుగా ఇంటిలోనే కుటుంబ సభ్యులతో చాలా సన్నిహితంగా అమితాబచ్చన్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు చనిపోతున్న తరుణంలో అమితాబ్ బచ్చన్ కి కరోనా పాజిటివ్ రావడంతో ఎలాంటి వార్త రాబోయే రోజుల్లో వినాలో అని తెగ టెన్షన్ పడుతున్నారు బాలీవుడ్ వర్గాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: