టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో వివాదాలు ఉన్నా సరే అవి టీ కప్పులో తుఫాన్ మాదిరిగా పోయేవే అనే సంగతి అందరికి స్పష్టంగా తెలిసిన విషయమే. ఏ వివాదం వచ్చినా సరే అది ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  మన తెలుగు లో స్టార్ హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే చాలా వరకు వివాదాలతో సావాసం చేసారు అనే పేరు కూడా ఉంది. ఇక చిరంజీవి చేసిన సైరా సినిమా వివాదాలకు కేంద్ర బిందువు గా మారిన సంగతి తెలిసిందే. 

 

సినిమా హక్కుల విషయంలో కనీసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫ్యామిలీ ని అడగలేదు అనే విమర్శలు చాలానే వచ్చాయి అప్పట్లో. కాని సినిమా యూనిట్ మాత్రం దానిపై స్పందించలేదు. ఇక ఈ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలి అని చాలా మంది అప్పుడు డిమాండ్ చేసారు కూడా. అయినా సరే ఈ సినిమాను చాలా పట్టుదలగా అప్పుడు విడుదల చేసారు. ఈ సినిమా అంత పెద్ద హిట్ కూడా కాలేదు. ఇక ఈ సినిమాలో చిరంజీవి కూడా చాలా వరకు ఆత్మరక్షణ ధోరణి తో వ్యవహరించారు. 

 

రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై అప్పుడు సహనం వ్యక్త౦ చేసాడు. తాను నిర్మాతగా తప్పు చేశా అనే మాట అప్పుడు చాలా మంది ముందు అతను అన్నాడు అని అంటారు. ఈ సినిమాలో అతను కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు అని అందుకే ఈ సినిమా అంత వివాదం అయింది అని అంటారు. ఇక ఇప్పుడు చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: