కరోనా మహమ్మారి ఈ భూమిద ఎక్కడ ఉన్నా ఎంత పెద్ద వారు అయినా కూడా వదిలిపెట్టడంలేదు. దానికి వారూ వీరూ తేడా లేదు. అందరి మీద పగ పట్టినట్లుగా దూసుకువస్తోంది. దాంతో టాలీవుడ్ షేక్ అవుతోందని అంటున్నారు. ఓ వైపు బాలీవుడ్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో పాటు మొత్తం కుటుంబం కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. ఆ వార్త స్ప్రెడ్ కావడంతో ఇపుడు  టాలీవుడ్లో కూడా కొంత ఆందోళన మొదలైందని అంటున్నారు.

IHG

దానికి కారణం ఉంది. తెలంగాణాలో కూడా కరోనా వీరవిహారం చేస్తోంది. ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా ఏ వైపు నుంచి పొంచి వస్తుందో ఎవరికీ తెలియడంలేదు. కేవలం ఒక నిముషం మాస్క్ పెట్టుకోకుండా కౌన్ బనేగా కరోడాపతి షూటింగ్ కి వెళ్ళినందువల్ల  అమితాబ్  ఇబ్బందులో పడ్డారని అంటున్నారు. ఇక కరోనా వైరస్ బాగా పెరిగిపోతున్న నేపధ్యంలో టాలీవుడ్ సెలిబ్రిటీలు కొంతమంది న్యూస్ పేపర్ కూడా కొనడం మానేశారు. అదే విధంగా ఇంట్లోకి ఎవరినీ రానీయకుండా పూర్తి కట్టడి చేసుకున్నారు. ఇంత చేసినా కూడా సిటీలో ఉంటే అంత సేఫ్ కాదేమోనని కొంతమంది భావిస్తున్నారుట. 

IHG

అందుకే ఎక్కడో సిటీకి దూరంగా కట్టుకున్న ఫాం హౌస్ లకు వెళ్ళాలని భావిస్తున్నారుట. అక్కడ అయితే పచ్చని ప్రక్రుతి వాతావరణంలో హ్యాపీగా ఉండవచ్చునని  అనుకుంటున్నారుట. ఇక కొంతమందికి ఆంధ్రాలో ఫాం హౌసులు ఉన్నాయి. అలాంటి వారు కూడా అక్కడికి వెళ్ళేందుకు రెడీ అవుతున్నారుట. మొత్తం మీద చూస్తే ఇప్పట్లో కరోనా కట్టడి సాధ్యం కాదని తేలిపోవడం, మరో వైపు మరింతగా వీర విహారం చేయడంతో సినీ సెలిబ్రిటీలు ఎవరికి వారు స్వీయ రక్షణలో పడ్డారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: