టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడు. వరుసగా మూడు ఫ్లాపులు రావడంతో హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. పడిపడి లేచే మనసు, రణరంగం, జాను చిత్రాలు ఫ్లాప్ కావడంతో అతని మార్కెట్ పై ఎఫెక్ట్ పడిన మాట వాస్తవమే. ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తున్న శర్వా, వరుసగా సినిమాలని లైన్లో పెడుతున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ సినిమా శర్వా చేతికి వచ్చిందని సమాచారం.

IHG

 

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరిగింది. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడని అన్నారు. అయితే కారణాలు తెలియదు గానీ ఈ సినిమా ఇంతవరకూ సెట్స్ మీదకి వెళ్లలేదు. అదీగాక ప్రస్తుతం వెంకీ నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. నారప్ప తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా చేయనున్నాడు.

 

IHG

ఇంకా తరుణ్ భాస్కర్ తో క్రీడా నేపథ్యంలో మరో సినిమా ఒప్పుకున్నాడు. ఇవన్నీపూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుంది. అందువల్ల ఆడాళ్ళు మీకు జోహార్లు ఇప్పట్లో తెరకెక్కే అవకాశం లేదు. అదీగాక వెంకీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం వల్ల కిషోర్ తిరుమల ఆ కథని శర్వా వద్దకి తీసుకెళ్ళాడట. శర్వాకి కథ నచ్చిందని, త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉండనుందని అంటున్నారు.

 

 

ఇంకా దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కిషోర్ తిరుమల ప్రస్తుతం రామ్ హీరోగా రెడ్ అనే టైటిల్ తో సినిమాని తెరకెక్కించాడు. రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ చిత్రం థియేటర్లు ఓపెన్ కాగానే విడుదల అవనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: