అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ తో "సాహస వీరుడు సాగర కన్య" సినిమా లో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా మారింది శిల్పా శెట్టి. ఆ టైంలో అనేక అవకాశాలు అందుకున్న శిల్పాశెట్టి తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఒకపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకుని దేశవ్యాప్తంగా స్టార్డమ్ సంపాదించింది. ఆ తర్వాత బాంబే డైయింగ్ కంపెనీ అధినేత రాజ్ కుంద్రాని పెళ్లాడి సెటిలైన సంగతి తెలిసిందే. అంతే కాకుండా వీరిద్దరికి ఇద్దరు సంతానం కూడా.

IHG'Nikamma ...

ఆ తర్వాత శిల్ప శెట్టి టెలివిజన్ రంగంలో కూడా రాణించడం జరిగింది. బిగ్ బాస్ 2 సీజన్ లలో యాంకర్ గా వ్యవహరించింది. అంతేకాకుండా 2007వ సంవత్సరంలో బ్రిటన్ లో సెలబ్రిటీ బిగ్ బ్రదర్ గా పేరుతెచ్చుకుంది. రియాలిటీ షోలలో జడ్జి గా వ్యవహరిస్తూ నిర్మాతగా మరియు వ్యాపార వేత్తగా రాణిస్తూనే ఐపీఎల్ క్రికెట్ లీగ్ టీంలను కొనటం లో కూడా రాటు తేలింది. ఇటువంటి తరుణంలో చాలా రంగాలలో సక్సెస్ సాధించిన శిల్పాశెట్టి ఇటీవల ఓయ్ ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీలో స్టార్ డమ్ అనేది తేలికగా రాదని సక్సెస్ సాధించాలంటే అన్ని విధాలుగా ప్రయత్నించాలని చెప్పుకొచ్చింది.

IHG't we get trained ...

మనిషి ప్రస్తుతం బతుకుతున్న ప్రపంచంలో ఉచిత భోజనం లేదు కాబట్టి ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి ప్రయత్నం తప్పనిసరి అని తెలిపింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రయోగాలు బాగా పెరిగాయని మంచి చేంజ్ భవిష్యత్తులో వస్తుందని చెప్పుకొచ్చింది. హీరోయిన్లకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు వస్తున్నాయి ఇది మంచి తరుణం అని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: