మన తెలుగు లో చాలా మంది  హీరోయిన్స్ ఉన్నా సరే కొంత మంది మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా హడావుడి చేస్తూ ఉంటారు. వారు పదే పదే సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ చేస్తూ తమను తాము జనాలకు చూపించుకునే ప్రయత్నం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. తమ వ్యాప్పారాలను దృష్టి లో ఉంచుకుని సోషల్ మీడియాలో క్రేజ్ ని పెంచుకోవడానికి గానూ నానా రకాలుగా కష్టపడుతూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్ప్పే హీరోయిన్ అలాగే నిర్మాత నమ్రత. ఆమె మహేష్ బాబు భార్యగా  అందరికి పరిచయం ఉంది. 

 

కాని ఆమెలో మంచి వ్యాపారవేత్త ఉన్నారు అని ఆమెను చూసిన చాలా మంది అంటూ ఉంటారు. ఇక ఆమె సోషల్ మీడియాలో చాల వరకు యాక్టివ్ గానే ఉంటూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఏదోక విషయం గురించి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన వంతుగా సందడి ఆమె పదే పదే చేస్తూ ఉంటారు. మహేష్ గురించి విషయాలు అదే విధంగా తన పిల్లలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆమె ప్రతీ చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో తన ఫాన్స్ తో పంచుకునే ప్రయత్నం చేయడం మనం చూస్తూ ఉంటాం. 

 

మహేష్ సినిమాలకు సంబంధించి కూడా ఆమె నుంచి ప్రకటనలు అప్పుడప్పడు వస్తు ఉంటాయి. ఇక ఇప్పుడు ఆమె మహేష్ బాబు హీరోగా వచ్చే సర్కారు వారి పాట సినిమాలో నటించే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. అది నిజమా కాదా అనేది తెలియదు గాని ఆ సినిమాలో మాత్రం ఆమె నటించడం ఖాయమని అంటున్నారు. ఆమెకు ఒక మంచి పాత్ర కూడా దర్శక నిర్మాతలు ఇవ్వడానికి రెడీ అయ్యారు అని అంటున్నారు. మరి నిజామో కాదో

మరింత సమాచారం తెలుసుకోండి: