నానీ ఇప్పుడు సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్త పడుతూనే చేస్తున్నాడు అనే మాట అందరికి తెలిసిందే. సినిమాలకు మార్కెట్ తగ్గడం తో నానీ ఏడాది కి ఒకటి విడుదల చేయడం కూడా ఇప్పుడు చాలా  వరకు కష్టంగా ఉంది అనే చెప్పాలి. అతను ప్రతీ సినిమా విషయంలో దాదాపుగా ఇప్పుడు జాగ్రత్త పడుతూనే చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు అతను తన సినిమాలను తానే నిర్మించుకునే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వచ్చే రెండేళ్ళ పాటు సినిమాకు చాలా వరకు కష్టంగా ఉండే అవకాశ౦ ఉంది అనేవిషయం చాలా వరకు అర్ధమవుతుంది. 

 

అందుకే నానీ ఇప్పుడు చాలా వరకు జాగ్రత్త పడుతూ వస్తున్నాడు అని అందుకే ఇప్పుడు తన సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరించే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. రెండు మూడేళ్ళ పాటు కష్టంగా మార్కెట్ ఉంటుంది కాబట్టి నిర్మాతలు తనను తక్కువ చేసే అవకాశం ఉంది అని తన గత మార్కెట్ ని దృష్టి లో ఉంచుకుని ఇప్పుడు పెట్టుబడి పెట్టే అవకాశాల్లు ఉండవు అని భావిస్తున్న నానీ ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తూ తన సినిమాలకు తానే నిర్మాత అయితే ఏ గొడవ ఉండదు అని అనుకుని చేస్తున్నాడట. 

 

ఇప్పటికే ఒక దర్శకుడితో ఇదే విషయాన్ని చెప్పిన నానీ కథ కూడా విన్నాడు అని అది రెడీ అవుతుంది అని వచ్చే ఏడాది లేదా ఈ ఏడాది చివర్లో అది సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని  టాలీవుడ్ లో టాక్ మరి. అది ఎంత వరకు నిజం ఏంటీ అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. నానీ ఇప్పుడు రెండు సినిమాల్లో చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు లాక్ డౌన్ లో ఆగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: