ఇప్పుడు సినీ ప్రపంచంలో ఎక్కువ శాతం టాప్ హీరోల తనయులు హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.  అతి కొద్ది మంది మాత్రమే స్వయంకృషితో పైకి వచ్చిన హీరోలు ఉన్నారు. ఇక బుల్లితెరపై తమ సత్తా చాటి తర్వాత హీరోలు గా మారినవారు కూడా ఉన్నారు.  ఇటీవల కన్నుమూసిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ కూడా మొదల తన ప్రస్థానం బుల్లితెరపైనే మొదలు పెట్టాడు. తెలుగు లో ఈ మద్య కన్నడ నటులు మంచి క్రేజ్ సంపాదిస్తున్నారు.  గతంలో ఉపేంద్ర హీరోగా నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఆ మద్య రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ తో కిచ్చ సుదీప్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

 

ఒక సీరియల్ నటుడిగా జీవితాన్ని మొదలుపెట్టి ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు హీరో యశ్. ‘బాహుబలి’ తర్వాత యష్ నటించిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ జాతీయ స్థాయిలో దుమ్మురేపింది. 2018 డిసెంబర్ 21న విడుదలైన మూవీ కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో మంచి కలెక్షన్లు సాధించింది. హీరో యష్ కూడా ఈ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు.  కన్నడ బాహుబలిగా పిలిచే ఈ సినిమాకు ఇపుడు సీక్వెల్ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’  కూడా వస్తోంది.  దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో షూటింగ్స్ ఆపిన విషయం తెలిసిందే.  

 

లాక్ డౌన్ నేపథ్యంలో సినీ నటులు ఇంటి పట్టున ఉంటూ తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యష్ కి  ఈ మధ్యనే కొడుకుపుట్టాడు. సరైన సమయంలో యశ్ కి ఖాళీ దొరికింది. బాబుతో చక్కగా ఆడుకుంటున్నాడు. తాజాగా యష్ తనయుడు టాయ్ కారులో ఆడుకుంటూ తెగ ఎంజయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో యష్ తన సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశాడు. కాగా,  కాగా యశ్‌- రాధికలు 2016లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కూతురు ఐరా, కొడుకు ఆయుష్‌ ఉన్నారు. అక్టోబ‌ర్ 30,2019న వీరికి ఆయుష్‌ జ‌న్మించ‌గా, మే 1న తొలిసారి కుమారుడి ఫోటోని షేర్ చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Can barely stand, but once the music is on our little man turns into a party animal !🥳 PS: Do ignore the over enthusiastic dad in the background 😆

A post shared by Yash (@thenameisyash) on

మరింత సమాచారం తెలుసుకోండి: