ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు టైం నడుస్తుంది అని చాలా మంది చెబుతున్నారు. వరుసగా మూడు భారీ బ్లాక్ బస్టర్ విజయలు  సాధించడంతో మంచి జోష్ మీద ఉన్నాడు మహేష్. ఇదే తరుణంలో "గీత గోవిందం" డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో చేస్తున్నట్లు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణా పుట్టినరోజునాడు మే 31వ తారీఖున ప్రకటించడం జరిగింది. మహేష్సినిమా ప్రకటించే టైంలో సోషల్ మీడియాలో మరో హ్యాట్రిక్ కి నాంది అంటూ ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో... సినిమా షూటింగ్ వచ్చే డిసెంబర్ నెలలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

 

‘సర్కార్ అనే టైటిల్’ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సరిగ్గా పక్కా ప్లానింగ్ తో టైమింగ్ తీసుకుని అనుకున్న టైంకి పూర్తిచేయాలని పక్కా షెడ్యూల్ డైరెక్టర్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే నటీనటులను సాంకేతిక నిపుణులను చాలా వరకు డైరెక్టర్ పరుశురాం ఓకే చేసినట్లు ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ అందాలనాయిక సెలక్ట్ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. 90లలో తన అందంతో, అభినయంతో ఇండస్ట్రీని ఊపేసిన భాగ్యశ్రీ "సర్కారు వారి పాట" లో మహేష్ తల్లి పాత్ర పోషిస్తోందని అంటున్నారు.

 

మరోపక్క వేరే సీనియర్ హీరోయిన్ ని తీసుకోవాలి అని పరశురామ్ ఆలోచిస్తున్నారట. కాగా సూపర్ స్టార్ మహేష్ అభిమానులు మహేష్ పక్కన మమ్మీ గా ఎవరైనా సరిపోతారు టైం ఎక్కువ తీసుకోవద్దని డైరెక్టర్ కి సూచిస్తున్నారట. ఇదిలా ఉండగా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటువంటి తరుణంలో సినిమాలో మహేష్ తల్లిగా సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ పేరు వినపడటం తో ఇండస్ట్రీలో ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: