యంగ్‌రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం యస్.యస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న బాహుబలి చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ తమన్నాలపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగుకు శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రానా అనుష్క శెట్టి తమన్నా రోల్స్ చేస్తున్నారు. బాహుబలి మొదటి పార్ట్ 2015లో థియేటర్లోకి వస్తుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు తమిళం హిందీతో బాషల్లో విడుదల చేస్తారట మరో వైపు తెలుగు సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఖర్చు పెట్టి తీస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సైడెడ్ రైట్స్ రూ. 12 కోట్లకు బెంగుళూరు రైట్స్ రూ. 8 కోట్లకు అమ్మడు పోయినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నైజాం ఏరియా రైట్స్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రూ. 26 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: