రీసెంట్ గా జరిగిన సిని’మా’ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటీనటులకు అవార్డులను అందించారు మాటివి యాజమాన్యం. ప్రతి ఏటా సిని‘మా’ అవార్డుల పేరుతో ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే ప్రతి ఏట ఎవరో ఒక సిని నట దిగ్గజానికి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్  అవార్డ్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సారి ఆ అవార్డును సూపర్‌స్టార్ కృష్ణకు ఇచ్చారు మాటివి వారు. సాహసానికి మరో పేరు సూపర్‌స్టార్ కృష్ణ. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలను చేసిన ఆయన 50 సంవత్సరాల సిని ప్రయాణంలో 350కు పైగా సినిమాలు నటించడం జరిగింది. సూపర్‌స్టార్ కృష్ణగారు మంచి నటుడే కాదు మంచి మనసున్న వ్యక్తి అని కూడా అందరు అంటుంటారు.     

 

అయితే ఇలాంటి నట దిగ్గజానికి జీవిత సాఫల్య పురస్కారం ఇస్తున్నందుకు దాదాపు సినిమా పరిశ్రమ మొత్తం ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు, హీరోలు నాగార్జున, వెంకటేష్ ఈ ఫంక్షన్ కి అటెండ్ అయ్యి సూపర్‌స్టార్ కృష్ణ గారికి తమ శుభాకాంక్షలు అందించారు. ఇక ఈ అవార్డు ఫంక్షన్ కి అటెండ్ అవ్వని మెగా స్టార్ చిరంజీవి, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా కృష్ణగారి గురించి వారి అభిప్రాయాన్ని రికార్డెడ్ మెసేజ్ ద్వారా తెలిపి శుభాకాంక్షలు అందించారు. అయితే తెలుగు సినిమా అభివృద్ధికి నాలుగు స్థంబాలుగా ఉన్న చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలలో సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి బాలయ్య తన విశెష్ ని తెలపకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

 

సిని’మా’ అవార్డుల్లో సూపర్ స్టార్లు:


ఒకవేళ ఫంక్షన్ కి వచ్చే తీరిక లేకపోతే చిరంజీవి, కమల్ హాసన్ లాగా రికార్డెడ్ మెసేజ్ అయినా పంపవచ్చు కదా అని అందరు అనుకుంటున్నారు. ఈ లెక్కన సూపర్ స్టార్ కృష్ణ అంటే బాలకృష్ణకు అభిమానం లేదా. ఎంతకాదనన్న సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు సూపర్ స్టార్ కృష్ణ. మరి అలాంటి గొప్ప మనిషికి జీవిత సాఫల్య పురస్కారం అందిస్తున్న తరుణంలో బాలయ్య అటెండ్ అవ్వకపోడానికి కారణాలు ఎంటా అని ఆరా తీస్తున్నారు ప్రేక్షకులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: