సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన బ్యూటి, అతిలోక సుందరి ఎవరైన ఉన్నారంటే, అది శ్రీదేవి ఒక్కరే. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈ అతిలోక సుందరి కాల్షీట్స్ కోసం స్టార్ నిర్మాతలు క్యూలు కడుతున్నారంటే ఆశ్ఛర్యంగా ఉంది.

నిజానికి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందనే కానీ, తెలుగులో ఇప్పటి వరకూ ఒక్క మూవీకి సైన్ చేయలేదు. చాలా మంది నిర్మాతలు మంచి స్టోరీలు, స్టార్ కాంబినేషన్ లు ఉన్నాయంటూ దగ్గరుకు వెళ్ళినా, వాళ్ళను మాత్రం శ్రీదేవి దూరం పెడుతూనే ఉందట. తెలుగు లో తప్ప మిగతా భాషల్లో నటించేందుకు శ్రీదేవి ఎందుకు ఆసక్తి చూపుతుందనే టాలీవుడ్ కి అర్ధం కాని విషయం.

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్న పులి చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది శ్రీదేవి. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ బాహుబలి లో శివగామి ప్రాతకి మొదట శ్రీదేవిని సంప్రదించగా, రెమ్యూనరేషన్ ఎక్కువ అడగడంతో ఆ ప్లేస్ లోకి రమ్యకృష్ణ ని తీసుకున్నారట. బాలక్రిష్ణ వందో చిత్రంలోనూ శ్రీదేవిని తీసుకోవాలని చర్ఛలు జరుగుతున్నాయి.

అలాగే తాజాగా మహేష్ అప్ కమింగ్ మూవీలోనూ శ్రీదేవి కాంబినేషన్ కోసం వెళితే, అస్సలు తన కాల్షీట్స్ ఫుల్ బిజిగా ఉన్నాయంటూ పంపించిందట. ఇదిలా ఉంటే ఒక్క  చిరంజీవి కాంబినేషన్ మాత్రం శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ సమాచరం. చిరంజీవి లీడ్ రోల్ వచ్చే ఏ మూవీలోనైన నటించేందుకు శ్రీదేవి వద్ద నుండి చిరు గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్టు టాలీవర్గాల్లో టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: