పూజా హెగ్డే వరుసగా టాప్ హీరోలా సరసన నటించి టాప్ హీరోయిన్ అయిపొయింది. అయితే పూజా హెగ్డే తన అందాలను మాత్రం ఓ రేంజ్ లో వెదజల్లుతుంది. మే 9న `మహర్షి` చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది కాబట్టి తెరనిండుగా సెలబ్రేషనే. పూజా ట్రీట్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కి కాలేజ్ ఫ్రెండ్ గా కనిపిస్తోంది పూజా హెగ్డే.


ఇప్పటికే మహేష్ - పూజా- అల్లరి నరేష్ ఫ్రెండ్షిప్ పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిపోయాయి. అరవింద సమేత తర్వాత పూజాకి నటించేందుకు ఆస్కారం ఉన్న మరో ప్రామిస్సింగ్ రోల్ దొరికిందనే భావిస్తున్నారు. తాజాగా పూజా షేర్ చేసిన ఫోటోలో సూర్య కిరణాలు ఇంద్రధనస్సుగా మారి తనని తాకుతూ ఇసుకలోకి ఇంకిన వైనం మైమరిపిస్తోంది. ఆ రేర్ మూవ్ మెంట్ ని పూజా ఎంజాయ్ చేస్తోంది.


ఈ లుక్ లో రెడ్ కలర్ పర్పుల్ టాప్ తో మైమరిపిస్తోంది. ఈ ఫోటోకి ఓ వీరాభిమాని ఆసక్తికర కామెంట్ ని పోస్ట్ చేశాడు. ప్లీజ్ పూజా నేను మీకు డైహార్టెడ్ ఫ్యాన్ ని. అలా ఎక్స్ పోజ్ చేయకండి! అంటూ వ్యాఖ్యను పోస్ట్ చేశాడు. మరి ఈ వ్యాఖ్యకు పూజా హెగ్డే ఏమని రిప్లయ్ ఇవ్వనుందో?  ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన జాన్ లో నటిస్తోంది. అలానే బాలీవుడ్ చిత్రం హౌస్ ఫుల్ 4 లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: