బిగ్ బాస్ తెలుగు సీజన్ 1, 2 మంచి రెస్పాన్స్ సంపాదించాయి. కాకపోతే బిగ్ బాస్ 2 సీజన్ మాత్రం ఇంటి సభ్యులతో గందరగోళం నెలకొంది. నాని హూస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 2 ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి..మొదట్లో నాని హూస్టింగ్ పై కూడా విమర్శలు వచ్చాయి. మొత్తానికి అన్ని గందరగోళాల మద్య సీజన్ 2 ముగిసింది..కౌశల్ విన్నర్ అయ్యాడు. ఇక మూడో సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే... ఈ షో లాంచింగ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇక ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ ఓ లీక్ బయటకు వచ్చింది. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కంటెస్టెంట్ గా ఉండబోతున్నారట.బిగ్ బాస్ 1కి జూనియర్ ఎన్టీఆర్, బిగ్ బాస్ 2కి నాని హోస్ట్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ 3లో వీరిద్దరికి ధీటైన స్థాయి హీరోని హోస్ట్గా పెట్టుకుంటే షోకి పాపులారిటీ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక మూడో సీజన్ కి ఎవరు అన్న విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు..ఈ మద్య నాగార్జున్ కన్ఫామ్ అయ్యారని వార్తలు వస్తున్నా అఫిషియల్ గా ప్రకటన రాలేదు.
బిగ్ బాస్ సీజన్ 3 లో టీవీ యాంకర్ ఉదయ భాను, యూ ట్యూబర్ జాహ్నవి దాసెట్టి, నటి శోభితా దూళిపాళ, గద్దె సింధూర, టీవీ నటుడు జాకీ తోట, నటులు వరుణ్ సందేశ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు, మనోజ్ నందం, డ్యాన్స్ మాస్టర్ రఘు, సింగర్ హేమచంద్ర, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కంటెస్టెంట్స్ గా ఉంటారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.