డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మారు మ్రోగుతుంది. కేజీఎఫ్ సినిమాతో సినిమా ప్రేక్షకులను తన వైపు కి తిప్పుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు అదే కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో చాలామంది సౌత్ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు డైరెక్టర్ ప్రశాంత్ దగ్గరికి క్యూ కట్టడం జరిగింది.


ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్ద ప్రొడ్యూసర్ నిర్మాత దిల్ రాజు కూడా డైరెక్టర్ ప్రశాంత్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిపినట్లు ఫిలింనగర్ టాక్. అయితే ఈ సినిమాలో తారక్ ని హీరోగా పెట్టి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా నిర్మించాలని అనుకుంటున్నారు మైత్రి మూవీస్ సంస్థకు చెందిన వారు.


ఈ క్రమంలోప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కి అదిరిపోయే స్టొరీ లైన్ చెప్పినట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే మరోపక్క సినిమా ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో వార్తలు బయటకు రావడంతో..జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కచ్చితంగా ఈ సినిమా చేయాలని అన్నా ఓకే చెయ్యండి ప్లీజ్ అన్నా అంటూ ఈ సినిమా గురించి వచ్చిన వార్త మై కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: