తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సీనియర్ కమెడియన్ క్రేజీ మోహన్ గుండెపోటుతో చెన్నైలో ఈరోజు(సోమవారం) కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని దగ్గరలోని కావేరి హాస్పిటల్కు తరలించారు. ఇవాళ ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని దగ్గరలోని కావేరి హాస్పిటల్కు తరలించారు. డాక్టర్లు ఆయన్ను కాపాడడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆయన కన్నుమూశారు.
67 ఏళ్ల క్రేజీ మోహన్ హాస్య నటుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా, నాటక కళాకారుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 1952లో ఈయన జన్మించిన ఈయన 1973లో మెకానికల్ ఇంజనీరింగ్ను పూర్తి చేశారు. ఇంజనీరింగ్ చదివేరోజుల్లోనే నాటకాలకు స్క్రిప్ట్స్ రాసేవారు. క్రేజీ మోహన్ సోదరుడు మధు బాలాజీ నాటక కంపెనీకి స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన -పొయ్కల్ కుదరై- సినిమాతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు.
వెన్బా అనే సింగిల్ లైన్ ఏకవాక్య కవితలు రాసేవారీయన. ఇప్పటి వరకు 40 వేల వెన్బాలను ఆయన రచించారు. ఇయన మంచి చిత్రకారుడు కూడా క్రేజీ మోహన్ అపూర్వ సోదరులు, మైకేల్ మదన కామరాజు, సతీలాలావతి, తెనాలి, పంచతంత్రం, కాదల కాదల, భామనే సత్యభామనే, వసూల్రాజా తదితర మూవీస్ లో కామెడీ పాత్రలతో నటించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈయన మృతికి సినీ పరిశ్రమ సంతాపాన్ని తెలియజేసింది.