గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు అయినా మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ లతో కలిసి హీరోయిన్ గా నటించిన భూమిక బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో నటించిన ఖుషి సినిమా తో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో దోచుకున్నారు.


అయితే ప్రస్తుతం కొంచెం వయసు మీదపడటంతో పాత్రలు పెద్ద వస్తున్న నేపథ్యంలో అయినా కానీ నటనకు ప్రాధాన్యత నిస్తూ ప్రాజెక్టులను ఒప్పుకుంటూ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఎంసీఏ సినిమా లో కీలకమైన పాత్రలో నటించిన భూమిక తాజాగా కోలీవుడ్ లో  ఒక థ్రిల్లర్ జానర్ సినిమాలో నటించడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ టాక్.


భయపెట్టే క్యారెక్టర్ తో పాటు ఎమోషనల్ లైన్స్ సినిమాలో ఆకట్టుకుంటాయట. ఉదయనిధి స్టాలిన్ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు. తెలుగులో కూడా సినిమాను రిలీజ్ చేసేందుకు భూమిక పాత్రను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఆమె పాత్రను హైలెట్ చేయనున్నారట. మా మారన్ దర్శకత్వం వహించనున్న ఈ థ్రిల్లర్ సినిమాలో ఆత్మికా కథానాయికగా నటిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: