రీసెంట్‌గా రిలీజ్ చేసిన మన్మధుడు 2 టీజర్లో నాగార్జున యంగ్ హీరోస్ లాగా రొమాన్స్ లో రెచ్చిపోయాడు. ఈ ఏజ్ లో నాగ్ అలాంటి బోల్డ్ సీన్స్ లో నటించడం అందరిని ఆశ్చర్యపరచింది. అయితే ఇలా రొమాన్స్ ఈ సినిమాలో నటించిన అందరీ హీరోయిన్స్‌తో చేశాడా..లేదా అన్నది సినిమా విడుదలైయ్యక తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. అయితే కీర్తిసురేష్, సమంత కూడా గెస్ట్ రోల్స్‌లో నటించారు.  కానీ ఆ రోల్స్ ఏంటి? అన్నదే సస్పెన్స్. 'ఐ డూ' అనే ఫ్రెంచ్ సినిమా రైట్స్ తీసుకొని, మన్మధుడు 2 సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. 


 
ఈ సినిమాలో పెళ్లికోసం, అద్దె పెళ్లాం కోసం ట్రయ్ చేస్తూ హీరో కొంతమంది అమ్మాయిలను కలుస్తుంటాడట. అలా కలిసేవాళ్ల పాత్రలనే కీర్తి సురేష్, సమంత చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిది కూడా జస్ట్ గెస్ట్ రోల్స్ మాత్రమే అని, సినిమాకు జస్ట్ మరింత బజ్ రావడం కోసం వాళ్లని తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. 


అయితే అద్దె భార్యల అన్వేషణలో భాగంగా సమంత ను నాగ్ కలుస్తాడా? లేక వేరే స్పెషల్ గెస్ట్ రోల్ ఏమైనా వుందా అన్నది తెలియాల్సి వుంది. నాగ్ ఫ్యామిలీకి సమంత సెంటిమెంట్ ఐకాన్ గా మారుతున్న విషయం మజిలీ చూస్తే అర్థమవుతుంది. డౌన్ ట్రెండ్ లో వున్న చైతన్యకు మజిలీ హిట్ ఇచ్చింది. అంతముందు అన్నపూర్ణ బ్యానర్ కే మనం సినిమా పెద్ద పేరు తెచ్చింది. అందుకే ఓ గెస్ట్ రోల్ లో సమంతను లక్కీ ఐకాన్ గా ఫిక్స్ చేసారేమో? అని ఫిల్మ్ నగర్‌లోను..ప్రేక్షకుల్లోను ఉన్న ఫీలింగ్.



మరింత సమాచారం తెలుసుకోండి: