పెద్దగా హిట్లు లేకపోయినా, సాయికుమార్ ఆది మాత్రం వరుసగా సినిమాలను చేసుకుంటూ సరైన బ్రేక్ కోసం ముమ్మరంగా తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు. కాగా తాజాగా రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఆది హీరోగా రాబోతున్న సినిమా 'బుర్రకథ'. కాగా ఈ సినిమా జూన్ 28న విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ ఇష్యూస్ కారణంగా విడుదల తేదీ జూన్ 29కి మారింది. ఇక ఈ సినిమాలో కంటెంట్ కంటే కూడా డైలాగ్ లే ఎక్కువ హైలెట్ అవుతాయట.
ఎంతైనా డైలాగ్ రైటర్, డైరెక్టర్ గా మారితే ఇది చాలా సహజమైన విషయమే అనుకొండి. కానీ కాన్సెప్ట్ కూడా హైలెట్ అయితే బాగుండేది. మొత్తానికి టీజర్ అయితే యూత్ కు బాగానే కనెక్ట్ అయ్యేలానే ఉంది. పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాలో ఆది సరసన మిస్తీ చక్రబోర్తి , నైరా షా హీరోయిన్స్ గా నటిస్తుండగా సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్ దీపాల ఈ సినిమా నిర్మిస్తున్నారు.