టాలీవుడ్ లో ప్రస్తుతం బ్రహ్మానందం లేని లోటు తీరుస్తోన్న ఏకైక కమెడియన్ ఎవరైనా ఉన్నారా అంటే వెన్నెల కిశోరే. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపొబ్బా నవ్వించడంతో పాటు, ఎన్నో సినిమాల విజయాల్లో కీలక పాత్రను పోషించాడు ఈ మోస్ట్ వాంటెడ్ యంగ్ కమెడియన్. అయితే ప్రస్తుతం వెన్నెల కిశోర్ మరో సినిమాతో కూడా నవ్వులతో ముంచెత్తడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నితిన్ చేసున్న 'భీష్మ'లో కూడా వెన్నెల కిశోర్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్ తన శైలి కామెడీతో హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇందులో ఆయన పాత్ర పేరు పరిమళ. ఈ పేరు వింటుంటే పేరే ఇంత నవ్వు తెప్పిస్తుంటే ఇక పాత్ర చేసే కామెడీ ఇంకెంత నవ్విస్తుందో అనిపిస్తోంది కదా. కాగా తాజాగా వెన్నెల కిశోర్ పార్ట్ కి సంబధించిన కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తయిందట. అయితే తరువాత జరిగబోయే షెడ్యూల్ లో మిగిలిన సీన్స్ ను షూట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది.