బుల్లి తెర ప్రేక్షకులతో పాటు వెండితెర అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 షురూ అయ్యింది. నేటి (జూలై 21) నుండి ఈ షో ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్గా రెట్ రెడీ అంటున్నారు.
100 రోజులపాటు నిర్విరామంగా కొనసాగే ఈ షోలో మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్లోకి అడుగుపెట్టనున్నారు. గతంలో మాదిరిగానే శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు స్టార్ మా ఛానల్ ఈ షో ప్రసారం కానుంది.
ఈ సీజన్కు కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తుండటంతో అందరి దృష్టి ఈ షోపైనే ఉంది. గతంలో సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండో సీజన్కి నాని హోస్ట్ చేశారు. ఇక మూడో సీజన్కి కింగ్ నాగార్జున రంగంలోకి దిగారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ హోస్ట్గా బుల్లితెరకు బిగ్ రేటింగ్స్ అందించిన నాగార్జున.. ఈసారి బిగ్ బాస్ ద్వారా రేటింగ్స్లో దూసుకుపోవడం నో డౌట్ అంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.
అయితే హోస్ట్తో పాటు బిగ్ బాస్ రియాలిటీలో షోలో కీలకమైన కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ హౌస్లో ఉండబోయే ఆ 15 కంటెస్టెంట్స్పై సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తుండగా.. ఈ 15 పేర్లు దాదాపు ఖాయం అయ్యేట్టు కనిపిస్తోంది. వారు ఎవరంటే...
1. నటి హేమ
2. యాంకర్ శ్రీముఖి
3. తీన్మార్ యాంకర్ సావిత్రి
4. నటి హిమజా రెడ్డి
5. వరుణ్ సందేశ్, వితికా షెరు (జంట)
7. సీరియల్ యాక్టర్ రవిక్రిష్ణ
8. టీవీ యాక్టర్ అలీ రెజా
9. టీవీ 9 జర్నలిస్ట్ జాఫర్
10. పునర్వీ భూపాలం
11. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్
12. సింగర్ రాహుల్
13. యూట్యూబ్ స్టార్ మహేష్
14. టీవీ నటి రోహిణి
15. డస్మాష్ స్టార్ అషూ రెడ్డి
అయితే ఈ 15 మంది కంటెస్టెంట్స్లో ఉండేది ఎవరు? కొత్తగా వచ్చి చేరేది ఎవరన్నది. నేటి రాత్రి 9 గంటలకు తేలిపోనుంది.