అడవి శేష్ రెజీనా కలిసి నటించిన సినిమా `ఎవరు`. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంకు వెంకట రాంజీ దర్శకత్వం వహిస్తున్నాడు. శేష్-రెజీనాలతో పాటు నవీన్ చంద్ర కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. సినిమా కథ అంతా ఈ ముగ్గురి చుట్టూ తిరుగుతుంది. అడవి శేష్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్న ఎవరు చిత్రంలో రెజీనా హీరోయిన్ గా అత్యాచారానికి గురయ్యే అమ్మాయిగా నటించింది.
ఈ చిత్రాన్ని `క్షణం` సినిమా తరువాత మరో సారి పివిపి నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ , ట్రైలర్లతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే పెరిగాయి. మరియు మూవీ ఫస్ట్ లుక్తోటే సర్ ప్రైజ్ చేశారు యంగ్ హీరో అడవి శేష్. ఒక నిమిషానిక పైగా ఉన్న టీజర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి. ఈ సినిమా ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున శర్వా `రణరంగం` చిత్రంతో పోటీపడుతూ థియేటర్లలోకి రావడానికి రెడీగా ఉంది.
నిజానికి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన అడవి శేష్ గూడాచారి సినిమాతో హిట్ కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. రెజీనా మాత్రం వరుస ఫ్లాపులతో ఉంది. వీరిద్దరికీ ఈ సినిమా హిట్ చాలా అవసరం. అయితే ఆగస్టు 15 న విడుదల అవుతున్న చిత్రాల్లో ఎవరు తప్పకుండా హిట్ కొడుతుందన్న పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది . మరి ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రీ బిజినెస్ ఇలా ఉంది.
ప్రీబిజినెస్ వివరాలు చూస్తే..
నైజాం- 2.80కోట్లు
వైజాగ్- 0.95కోట్లు
తూ.గో- 60లక్షలు
ప.గో జిల్లా- 50లక్షలు
కృష్ణ- 65లక్షలు
గుంటూరు- 75లక్షలు
నెల్లూరు- 30లక్షలు
సీడెడ్- 1.15కోట్లు
కర్నాటక- 50లక్షలు
రెస్టాఫ్ ఇండియా- 15లక్షలు
ఓవర్సీస్- 1.65 కోట్లు
-------------------------------------------------
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ = 10 కోట్లు
-------------------------------------------------