అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోయి ప్రజా సమస్యలపై పోరాడుతూ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పై ఎక్కడా కూడా రూమర్లు తగ్గటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఇక సినిమాలు చేయను..నా కట్టె కాలే వరకు తుది శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడటం తప్ప వెనక్కి తిరిగి...సినిమాల్లో నటించాను అని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెబుతున్నా కానీ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేయడం గ్యారెంటీ అని రూమర్లు తెగ వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ పై రోమన్లు సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీలో కొత్తగా ఒక వార్త వినబడుతోంది.


అదేమిటంటే చిరంజీవి రాజకీయాల్లో ఉండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన క్రమంలో కొణిదెల ప్రొడక్షన్స్ అనే సంస్థను పెట్టి అదే సమయంలో రామ్ చరణ్ నిర్మాతగా మారడం జరిగింది. చిరంజీవి హీరోగా రి ఎంట్రీ విషయంలో ఖైదీ నెం150 సినిమా నిర్మించి అద్భుతమైన హిట్ అందుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే చిరంజీవి సైరా సినిమా నిర్మించి ఇప్పుడు అదిరిపోయే హిట్ అందుకున్న రామ్ చరణ్...త్వరలోనే పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించబోతున్నట్లు తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఆలోచనలకు తగ్గ విధంగా స్టోరీ కూడా రెడీ చేయాలని ఇప్పటికే డైరెక్టర్లకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త ఇండస్ట్రీలో, సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అయితే ఇదంతా ఒక పక్క పుకార్లు అని ఎంత మాత్రం చెబుతున్న కచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో కి వస్తారు అని మరోపక్క వార్తలు గట్టిగా సినిమా ఇండస్ట్రీ నుండి బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం ఏఎం రత్నం, మైత్రి మూవీస్, హారిక అండ్ హాసిని సంస్థలు కూడా ఎదురు చూస్తున్నట్లు అడ్వాన్సులు కూడా ఇచ్చినట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి రామ్ చరణ్ కూడా రావడంతో న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: