రాయలసీమ రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న యువ కీలక నేత వైసీపీ పార్టీ నాయకుడు  కర్నూలు జిల్లా ప్రాంతానికి చెందిన వాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై శ్రీ రెడ్డి మనసు పారేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో వరుసగా ఇంటర్వ్యూ ఇస్తూ బాగా పాపులర్ అయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలవడానికి తీవ్రంగా కృషి చేసి అతి చిన్న వయసులోనే అతిపెద్ద రాజకీయ నేతగా ఎదుగుతున్నాడు. ఇటువంటి నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా పాపులరైన శ్రీరెడ్డి మెగా కుటుంబంపై  విమర్శలు చేసే అజ్ఞాతంలోకి వెళ్లి ఇటీవల వెలుగులోకి వస్తూ రాజకీయ నాయకుల పై షాకింగ్ కామెంట్ లు చేస్తుంది.


మొన్న రజనీకాంత్ రాజకీయాలు గురించి ప్రస్తావిస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి తాజాగా బైరెడ్డి సిద్ధార్థ గురించి పచ్చి పచ్చి గా మాట్లాడటం జరిగింది . వైసిపి పార్టీకి చెందిన ఈ యువ నాయకుడు జీవితంలో కనీసం ఒక్క రోజైనా భార్యగా బతకాలని ఉందంటూ ఘాటుగా కామెంట్ చేసింది. అతడితో ఒక్కరోజు భార్యగా గడిపిన తర్వాత చచ్చినా పర్లేదంటోంది శ్రీరెడ్డి. దీంతో శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాజకీయంగా చాలా పైకి ఎదుగుతూ వస్తున్నాడు. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్...కర్నూలు జిల్లా ప్రాంతం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన తమ్ముడు అని...రాజకీయంగా అన్ని విధాల తనని పైకి తీసుకు వస్తానని చెబుతూ బైరెడ్డి సిద్ధార్థ పై పొగడ్తల వర్షం కురిపించడం జరిగింది. ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గానికి వైసీపీ పార్టీ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: