విక్టరీ వెంకటేష్ కి కామెడి బ్యాక్ డ్రాప్ లో సినిమాలంటే చాలా ఇష్టం. ఇంటిల్లపాదిని ఎంటర్‌టైన్ చేయడం లో వెంకీ స్టైలే వేరు.ఇంతకముందు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, నమో వేంకటేశాయ ఇప్పుడు ఎఫ్-2 సినిమాలతో వెంకీ కామెడి టైమింగ్ సూపర్ అని అర్థమైంది. ఇక వెంకీ-తరుణ్ భాస్కర్ కాంబోలో సినిమా గురించి చాలారోజులుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అంతేకాదు.. ఈ సినిమా స్టోరీ మీద కూడా ఎప్పటి నుంచో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. వీళ్ళీద్దరి కాంబినేషన్ లో ఓ హిలేరియస్ ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ రాబోతోందని చెప్పుకుంటున్నారు. ఇక తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులతో పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అందుకే వెంకీ-తరుణ్ కలిసి అదే జానర్ లో రొమాంటిక్ కామెడీ చేస్తారని అనుకున్నారు. కానీ అందరికీ వీళ్ళు షాక్ ఇచ్చారు.    

వెంకీ, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో వస్తోందని తాజా సమాచారం. గుర్రపు పందాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందట. సినిమాలో గుర్రపు పందాలు కాసే బెట్టింగ్ రాయుడిగా వెంకీ కనిపించబోతున్నాడని ఆసక్తికరమైన వార్త బాగా హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు.. వెంకీ డైలాగ్ డెలివరీ కూడా హైదరాబాద్ యాసలో ఉంటుందనేది మరో హాట్ న్యూస్. వెంకీ కోసం తరుణ్ రాసుకున్న ఈ పాయింట్ అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేసిందని తెలుస్తోంది. 

నిజానికి వెంకీతో సినిమా అనగానే తరుణ్ భాస్కర్ నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి..వంటి 2-3 స్టోరీలైన్స్ అనుకున్నాడట. వెంకీతో చాలాసార్లు స్టోరీ డిస్కషన్స్  కూడా జరిగాయట. కానీ ఇలాంటి కథలపై వెంకటేష్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. పైగా నెక్స్ట్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో, ఆ జానర్ గురించి వెంకీ ఆలోచించలేదు. అందుకే తరుణ్ అనుకున్న సినిమాకి ఈ గుర్రపు పందాల బ్యాక్ డ్రాప్ స్టోరీలైన్ ఫిక్స్ అయింది. సురేష్ బాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించ- బోతున్నారు. అంతేకాదు ఓ బేబి వంటి సూపర్ హిట్ సినిమాలో భాగస్వాములైన పీపుల్స్ మీడియా వాళ్ళు   సహ-నిర్మాతగా వ్యవహరించనున్నారట. వెంకీ మామ రిలీజైయ్యాక ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: