రిషి (నారా రోహిత్) ఓ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ గాయ్.. డాక్టర్ చదివిన తను సరదా జీవితాన్ని గడుపుతుంటాడు. తను ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాన్ని వెతికే ఈ హీరో కాస్త అల్లరి చిల్లరగా ఉంటాడు. సినిమా ఓ పెళ్లితో మొదలవుతుంది. అదే టైం లో సావిత్రి జన్మిస్తుంది. మొదట పుట్టిన దానికి తల్లిగారి తరపున పేరు పెట్టారని ఈసారి పుట్టబోయే బిడ్డకు తన తల్లి పేరు పెట్టాలని అనుకుంటాడు దొరబాబు (మురళి శర్మ). అనుకున్నట్టుగానే అమ్మాయి పుట్టడం సావిత్రి అని నామకరణం చేయడం జరుగుతుంది.
ఇక అదే సమయంలో దొరబాబు చెల్లిని చేసుకోవాలని భీష్మా రావు (రవి బాబు) ప్రయత్నిస్తాడు. కాని కృష్ణ (అజయ్) తనకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. ఆ తర్వాత కథ 20 సంవత్సరాల ఫాస్ట్ ఫార్వార్డ్ అవుతుంది. సావిత్రి (నందిత) చలాకీ గల పిల్ల చిన్నప్పటి నుండి తనకు పెళ్లి మీద ఓ మోజు.. తనని పెళ్లి కూతురిగా ఎప్పుడు చేస్తారా అని చూస్తుంటుంది. ఇక తన అక్క గాయత్రి (ధన్య బాలకృష్ణ) పెళ్లి ఫిక్స్ అవ్వగా దాన్ని కాదనుకుని వెళ్లిపోవడంతో బాబాయ్ కృష్ణకు ఫోన్ చేసి ఆమెను మరళా ఇంటికి రప్పించి ఇంటి పరువు కాపాడేలా చేస్తుంది. అయితే రిషి అసలు సావిత్రి జీవితంలోకి ఎలా వచ్చాడు..? పెళ్లి పెళ్లి అని కలవరించే సావిత్రికి పెళ్లి జరిగిందా..? లేదా..? రిషికు దొరబాబు ఫ్యామిలీకు ఉన్న సంబంధం ఏంటి..? తమ్ముడు కృష్ణ గురించి దొరబాబు తెలుసుకున్న నిజం ఏంటి..? కథలో ఉన్న ట్విస్ట్ లు..
సావిత్రి సినిమా గురించి ముందుగా చెప్పుకోవాల్సి వస్తే సినిమా దర్శకుడు పవన్ సాధినేని.. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో పర్వాలేదనిపించుకుని..సావిత్రిగా నందితతో నారా రోహిత్ తో సరసాలాడేలా చేశాడు. సినిమా కథ సినిమామీద తనకున్న కమిట్మెంట్ బాగా కనబడ్డాయి. సినిమా దర్శకుడిగా ఓకే అనిపించుకున్నా కథ కథానాల్లో కొత్త దనం లోపించడం కాస్త దెబ్బకొడుతుంది. తనకొచ్చిన మంచి ఆఫర్ ను చాలా రిచ్ గా సినిమా తీసే ప్రయత్నంలో సినిమా బాటం లైన్ ను మిస్ చేశాడు దర్శకుడు.
ఇక శ్రవణ్ ఇచ్చిన సంగీతం సినిమా చూస్తున్నంత సేపు ఓకే కాని థియేటర్ నుండి బయటకు వస్తే ఒక్క పాట గుర్తుండదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఓకే అనిపించేలా చేశాడు. వసంత్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించినా సినిమాలో లొకేషన్స్ ఎక్కువ లేకపోవడంతో కాస్త కలర్ ఫుల్ గా అనిపించదు. హీరో హీరోయిన్ ను గ్లామర్ గా చూపించడంలో కెమెరా మెన్ వసంత్ పాస్ అయ్యాడు. ఇక సినిమాకు ఎడిటింగ్ చేసిన గౌతం నెరుసు మరింత కత్తెరలు వేయాల్సి ఉంది. సినిమా మరి ఫ్లాట్ గా అనిపించేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. సినిమా నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ తన టేస్ట్ ను సినిమాలో చూపించారు. సినిమాకు ఎంత బడ్జెట్ అవసరం ఉందో డీసెంట్ గా తీశారు. ప్రొడక్షన్ లో ఎక్కడ సినిమా రిచ్ నెస్ కోల్పోలేదు.
దర్శకుడు పవన్ సాధినేని హీరోయిన్ కు పెళ్లంటే ఇష్టం అన్న పాయింట్ తో మొదలు పెట్టి.. ఆమెను పెళ్లి చేసుకోడానికి 20 ఏళ్లుగా ఓ విలన్ రెడీగా చేసుకుని.. ఆమెకు ఓ ప్రయణంలో అనుకోకుండా ఓ హీరోని పరిచయం చేసి ఇలా రకరకాలుగా కన్ ఫ్యూజ్ చేస్తూ ఆడియెన్స్ క్లారిటీ మిస్ అయ్యేలా చేశాడు. ఒక లైన్ రాసుకుని దానికి బలమైన డైలాగులు రాసుకున్నాడు కాని ఆ బలమైన మాటలకు తగ్గ సన్నివేశాలు రాయడంలో విఫలమయ్యాడు. మొదటి భాగం మొత్తం హీరో హీరోయిన్ ని చూడటం ఆమె ను ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో ఓ ప్రేమ జంటను కలపడం అంతా కాస్త బోర్ కొడుతుంది. మధ్యలో పోసాని ఎపిసోడ్ ప్రేక్షకులకు అంతగా నవ్వులు పండించదు కాదు కదా విసుగు తెప్పిస్తుంది. ఇక ఎలాగోలా హీరోయిన్ ను ఇంప్రెస్ చేయాలనుకుంటే ఆమె మాత్రం సారీ అనేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం కోసమే హీరోకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయడం కాని మనోడి సావిత్రి ప్రేమలో ఉండి డైరెక్ట్ గా అమ్మాయి నాన్నకే పెళ్లి చూపులు క్యాన్సిల్ అనేస్తాడు. తీరా అది సావిత్రి అని తెలియడం అక్కడకెళ్లి సారీ చెప్పాలనుకోవడం ఇదంతా లాగింగ్ గా అనిపిస్తుంది.
ఇక రవిబాబు 20 సంవత్సరాల పగని చివరగా హీరో కొట్టడానికి వస్తే సిల్లీగా మాట్లాడటం అసలు బాగా అనిపించదు. సినిమా పాయింట్ ఇది అని కచ్చితంగా దర్శకుడికే ఓ కచ్చితమైన ఉన్నా దాన్ని ప్రేక్షకులకు చేరువేయడంలో విఫలమయ్యాడు. నారా రోహిత్ ఇలాంటి చేసిన ఈ సావిత్రి ప్రయత్నం పర్వాలేదనిపించినా ఇంకా తన డైలాగ్ మాడ్యులేషన్ లో మెళుకువలు నేర్చుకోవాల్సి ఉంది. ఇక నందిత తన పాత్ర వరకు ఓకే కాని అక్కడక్కడ డీ గ్లామరస్ గా కనిపించి చిరాకు తెప్పిస్తుంది. మొత్తానికి సావిత్రి అని ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్, నందితల సినిమా కేవలం డైలాగ్స్ మాత్రమే బలంగా రాసుకుని సినిమా కథ కథనాల మీద ఎటువంటి శ్రద్ధ పెట్టని సినిమా అనొచ్చు. మరి బోర్ కొడుతుంటే ఏదో టైం పాస్ కు ఓ సినిమా చూద్దాం అనుకునే వారికి సావిత్రి నచ్చే అవకాశం ఉంది.