బాలీవుడ్ బాహుబలిగా ప్రాచుర్యం పొందిన బాజీరావ్ మస్తాని సినిమా ఎలాగైనా సరే సూపర్ హిట్ కొట్టి బాహుబలి రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు సినిమా దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ. అందుకే సినిమా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న బాజీరావ్ మస్తానిలో టైటిల్ రోల్ రణ్ వీర్ సింగ్ చేస్తుండగా.. హీరోయిన్స్ గా ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే చేస్తున్నారు.. అయితే ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఒకటి ప్లాన్ చేశాడు దర్శక నిర్మాత భన్సాలీ.


సంజయ్ లీలా భన్సాలి 2002లో తీసిన షారుఖ్ దేవదాస్ సినిమాలో డోలారే డోలారే సాంగ్ గుర్తుండే ఉంటుంది. సినిమా సక్సెస్ అవ్వడం పక్కన పెడితే ఆ సినిమాలో ఆ సాంగ్ సూపర్ సక్సెస్ అయ్యింది. మాధురి, ఐశ్వర్య రాయ్ లు పోటా పోటీగా నర్తించిన ఆ సాంగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు బాజీరావ్ మస్తాని సినిమాలో కూడా అలాంటి సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడు దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలి. ఆ సాంగ్ లానే ఈ సాంగ్లో కూడా హాట్ హీరోయిన్స్ ఇద్దరు ఆడి పాడుతున్నారు.


అయితే బాజీరావ్ మస్తానిలో నటిస్తున్న హాట్ హీరోయిన్స్ ప్రియాంక చోప్ర, దీపికా పదుకునేలే ఈ స్పెషల్ సాంగ్లో నర్తించడం జరుగుతుంది. బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేస్తున్న వీరిద్దరు ఇప్పుడు ఒకే సాంగ్లో నర్తించడం అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. సినిమాలో కూడా ఈ సాంగ్ సూపర్బ్ టైమింగ్లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు భన్సాలి. రణ్ వీర్ సింగ్ హీరోగా చేస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించబడుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది.


రణ్ వీర్ సింగ్ తో పాటుగా ఈ సినిమాలో నటిస్తున్న దీపికా, ప్రియాంకాలు కూడా యుద్ధాన్ని నేర్చుకుని మరి ప్రెజెంట్ చేస్తున్నారట. ఈ ఇయర్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని మిగుల్చుతుందో చూడాలి. అయితే ఈ సీజన్లోనే షారుఖ్ ఖాన్ తన 'ఫ్యాన్' సినిమా రిలీజ్ చేస్తున్నాడు. మరి షారుఖ్ థాటికి ఈ సినిమా నిలుస్తుందా లేదా అన్నది రిలీజ్ అయితే గాని చెప్పలేం. 



మరింత సమాచారం తెలుసుకోండి: