మద్రాస్ లాంటి హిట్టు సినిమా తీసిన డైరెక్టర్ రంజిత్ ని పిలిచి మరీ సినిమా ఇచ్చాడు హీరో రజినీకాంత్. అంత పెద్ద స్టార్ ని టాకిల్ చెయ్యడం అంటే అది చాలా పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. అలాంటిది రంజిత్ కేవలం ఒక టీజర్ తోనే సినిమాని దున్నేసాడు. పా రంజిత్ కెరీర్ లోనే వచ్చిన అతిపెద్ద అవకాశం కబాలి అని చెప్పాలి. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి అయ్యి అంతా కూల్ గా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడం తో అందరూ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

 

ఎక్కడ చూసినా ఈ సినిమా రిజల్ట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు కేవలం ఒక టీజర్ తో ఆ రేంజ్ క్రేజ్ రజిని కెరీర్ లో మొట్ట మొదటి సారి వచ్చింది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ రంజిత్ " మొదట్లో చాలా కంగారు , టెన్షన్ పడేవాడిని. ఒక్కొక్కసారి మూడు నాలుగు టేక్ లు చెయ్యాల్సి వచ్చేది . ఒకటికి రెండు సార్లు అడుగుదాం అంటే భయం కూడా వేసేది నాకు. నేను ఆయన దగ్గరకి వెళ్లి రీటేక్స్ కోరడం విషయం లో క్షమించమని కోరాను . నన్ను ఆయన అప్పుడు ట్రీట్ చేసిన విదానం అద్భుతం.

 సీన్ పెర్ఫెక్ట్ గా రావడం కోసమే కదా అందరం ఇంత కష్టపడుతున్నాం సరిగ్గా రానప్పుడు మొహమాటం లేకుండా అడుగు అన్ని ఆయన చెప్పడంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. " అని చెబుతున్నాడు డైరెక్టర్ రంజిత్. అప్పుడు నా మొహం లో రంగులు మారిపోయి విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఈ నెల 22 న ఈ సినిమా విడుదల అవుతూ ఉండడం తో రంజిత్ ఇప్పుడు అన్ని చోట్లా ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: