మెగా మేనళ్లుడిగా తీసిన నాలుగు సినిమాలతోనే సుప్రీం స్టార్ గా క్రేజ్ సంపాదించిన సాయి ధరం తేజ్.. తన ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషల్ ఎట్రాక్టివ్ ఎలిమెంట్స్ తో ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. నిన్నటి సినిమా దాకా మెగాస్టార్ రీమిక్స్ లతో హోరెత్తించిన తేజు ఫ్యాన్స్ నుండి కాస్త నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఇక అలాంటి జిమ్మిక్కులు చేయడం మానేశాడు.


ప్రస్తుతం సునీల్ రెడ్డి డైరక్షన్లో తిక్క సినిమా చేస్తున్న తేజు. ఆ సినిమా కోసం అరవ హీరోలను ఫుల్ గా వాడేస్తునాడు. ఓ హీరో సినిమాలో మరో హీరో పాట పాడితే అదో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఆ క్రమంలో థమన్ డైరక్షన్లో వస్తున్న ఈ తిక్కలో తేజు ధనుష్, శింబు ఇద్దరి చేత తమన్ ద్వారా పాటలు పాడిస్తున్నాడట. 


ఇప్పటికే థమన్ పాట కంపోజ్ చేసిన థమన్ రీసెంట్ గా శింబు పాట పూర్తి చేశాడట. సో చేస్తున్న సినిమా అన్ని కోణాల్లో ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయాలి ఆ విషయంలో కాస్త ఎక్కువ ఆకులు చదివిన మెగా మేనళ్లుడు ఈసారి తమిళ హీరోల క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. సోలోగా వచ్చి సూపర్ హిట్స్ కొడుతున్న ఈ సుప్రీం హీరో తిక్కతో కూడా అదిరిపోయే హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నాడు. 


లారిసా, మన్నారా చోప్రా హీరోయిన్స్ గా నటిస్తున్న తిక్క సినిమా ఈ నెల చివరన ఆడియో రిలీజ్ చేస్తుండగా.. సినిమాను ఆగష్టు మొదటి రెండు వారాల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. తన స్టైలిష్ యాక్షన్ తో మెగా అభిమానుల మనసు దోచుకున్న సుప్రీం హీరో తిక్కతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో తెలుసుకోవాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: