మళ్లీ మరో సందేశాత్మక కథలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ‘కెమెరా మేన్ గంగతో రాంబాబు’లో యువతకి సందేశాన్ని ఇచ్చాడు పవన్. ఇప్పుడు అదే తరహాలో మరో సందేశాన్ని ఇచ్చేందుకు సిద్దపడుతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించేందుకు పచ్చ జెండా ఊపాడన్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓ న్యాయవాది పాత్రను పోషించబోతున్నారు. ఏమాత్రం లౌక్యం తెలియని ఓ న్యాయవాదిగా అలరించబోతున్నట్టు సమాచారం. కేసులేవీ లేక చెట్టుకింద ఖాళీగా కూర్చునే ఓ లాయర్ కి అనూహ్యంగా ఓ కేసు వస్తుంది. అది ఎలాంటి మలుపు తిరుగుతుంది అనే అంశం చుట్టూనే కథ అల్లుకుంటున్నారట. వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపేలా కథలోని అంశాలను గుద్దిగుచ్చుతున్నారు దర్శకుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: