దోస్త్ మేరా దోస్త్... అంటూ ఇంతకాలం కలిసి ప్రయాణం సాగించారు శ్రీనువైట్ల కోన వెంకట్.., ఇప్పుడు ఇద్దరికీ దారుణంగా చెడింది. కోన వెంకట్ శ్రీను వైట్ల మీద ఫైర్ అయిపోతున్నాడట.., మొన్నటి వరకూ చెట్టాపట్టాలేసుకొని తిరిగిన వీరిద్దరికీ ఎందుకు చెడింది? ఎందుకు విడిపోయారు? ఈ అగాథానికి కారణాలేంటి? ఈ విషయాలు ఆరాతీస్తే... కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. రచయితలకు రావల్సిన క్రెడిట్ శ్రీనువైట్ల రాకుండా చేస్తున్నాడట.., కథ, స్ర్కీన్ప్లే విషయంలో వేరే వాళ్లు సహకరించినా టైటిల్ కార్డులో తన పేరు వేసుకొంటున్నాడట...,
ఈ విషయంలో శ్రీనువైట్ల, కోన వెంటట్, గోపీ మోహన్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఎన్నిసార్లు గొడవ పెట్టుకొన్నా ఫలితం లేకపో్యింది. దాంతో కోన బయటకు వచ్చేశాడు. గోపీ మోహన్ పరిస్థితి కూడా ఇంతే. త్వరలో ఈ రచయితలు ఇద్దరూ దర్శకులు కాబోతున్నారు.
మరో దర్శకుడి దగ్గర పనిచేయడం ఏమిటి? అనుకొన్నారట. అందుకే... ఎవరి దారి వాళ్లు చూసుకొన్నారు. తన కుడి, ఎడమ భుజాలు కోల్పోయిన శ్రీను... రాబోయే రోజుల్లో ఎలా నెగ్గుకొస్తాడో?
మరింత సమాచారం తెలుసుకోండి: