అలాగే ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ‘ఎవడు’ సినిమాలోనూ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్ నటిస్తున్నట్లు తాజా సమాచారం. వంశీ పైడపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎవడు’ సినిమాను దిల్ రాజ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
‘ఎవడు’ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం బయటకు రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.