మెగా వారసుడు రామ్ చరణ్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకోవడంలో ముందు ఉంటున్నాడు. ‘మగధీర’తో సినిమాతో తన సత్తా చాటిన రామ్ చరణ్ రచ్చ, నాయక్ లతో వరుస విజయాలు సాధించాడు. కాగా, రామ్ చరణ్ ఇటీవల వచ్చిన ‘నాయక్’ సినిమాలో ద్విపాత్రాభినయంతో చేసిన విషయం తెలిసిందే.

అలాగే ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ‘ఎవడు’ సినిమాలోనూ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్ నటిస్తున్నట్లు తాజా సమాచారం. వంశీ పైడపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎవడు’ సినిమాను దిల్ రాజ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

‘ఎవడు’ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం బయటకు రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: