ఆ తరువాత పలు సినిమాల్లో నటించి కోలీవుడ్కు మకాం మార్చింది. ఈ సంవత్సరంలో మలయాళం,తమిళ్లో రిలీజ్ అవుతున్న నేరం మూవీపై ఎక్కువగా ఆశలను పెట్టుకుంది. ఈ మూవీ మే 17న రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ రిలీజ్కు ముందే తమిళ్ క్రేజీ హీరో ఆర్య సరసన రాజారాణి మూవీలో హీరోయిన్గా నటిస్తుంది. అంతేకాకుండా రజనీకాంత్ అల్లుడు ధనుష్తో కూడ ఓ మూవీలో హీరోయిన్గా చేస్తుంది.
ఎక్కడ ఎన్ని భాషల్లో నటించిన ఒక్క టాలీవుడ్ నటిస్తే ఆ క్రేజే వేరు. అందుకే ఈ కేరళ బ్యూటీ నెక్ట్స్ టార్గేట్ టాలీవుడ్ అని అంటోంది. రీసెంట్గా టాలీవుడ్కు సంబంధించిన కొంతమంది యువహీరోలతో కూడ చర్చలు జరిగినట్టు చెబుతున్నారు ఈమె సన్నిహితులు. ఆల్ ది బెస్ట్ 'నజ్రియ నజిమ్'.