పూరి బాలీవుడ్‌లో త‌న ప్రతాపం చూపాల‌ని డిసైడ్ అయిపోయాడు. ఇక టాలీవుడ్‌లో ఏ నిర్మాతా త‌న‌ను న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని ఫిక్స‌య్యాడు. అందుకే ముంబై ప‌య‌న‌మయ్యే విష‌య‌మై సీరియ‌స్ గా ఆలోచిస్తున్నాడు. అక్క‌డ త్వ‌ర‌లో ఓ సినిమా చేయ‌డం మాత్రం ఖాయం.

అయితే అది ఇడియ‌ట్ రిమేక్ కాదు. మ‌హేష్ సినిమా బిజినెస్‌మేన్‌ని బాలీవుడ్‌లోకి తీసుకెళ్తాడ‌ట‌. ఈ సినిమా అభిషేక్ బ‌చ్చ‌న్‌తో చేయాల‌ని అనుకొన్నాడు. అయితే ఇప్పుడు ర‌ణ‌బీర్‌క‌పూర్ అయితే బాగుంటుంద‌ని అనుకొంటున్నాడ‌ట‌. కొన్ని మార్పుల‌తో.... బిజినెస్‌మేన్ సినిమా తీయ‌డానికి రెడీ అయిపోయాడు పూరి.

ర‌ణ‌బీర్ కూడా పూరితో సినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడ‌ట‌. ద‌క్షిణాది క‌థ‌లంటే అత‌నికీ ఇష్ట‌మే. అందుకే... బిజినెస్‌మేన్‌కి ఓటేశాడ‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: