ఇప్పుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌భంజ‌నం జ‌పాన్‌కీ పాకింది. అక్క‌డ చెర్రీ తుఫాన్ రేపుతున్నాడు. త‌న స్టామినా నిరూపించుకొంటున్నాడు. ఔను... రామ్‌చ‌ర‌ణ్ మ‌గ‌ధీర ఇప్పుడు జ‌పాన్‌లో సంద‌డి సృష్టిస్తోంది. ఈ సినిమాని ఇటీవ‌లే జ‌పాన్‌లోనూ విడుద‌ల చేసారు, అక్క‌డ ఈ మెగా హీరో చిత్రానికి అనూహ్య స్పంద‌న వ‌స్తోంది.సాధార‌ణంగా ర‌జ‌నీకాంత్ సినిమాలు..

జ‌పాన్‌లో విడుద‌ల అవుతుంటాయి. అక్క‌డ ఈ సూప‌ర్‌స్టార్‌కి విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ కూడా ర‌జ‌నీ స‌ర‌స‌న చేరాడు. ర‌జ‌నీకి విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉన్న చోట‌.. రామ్‌చ‌రణ్ కాలుమోపి ఓ సాహ‌సం చేయ‌డ‌మే కాకుండా, నిల‌బ‌డ్డాడు కూడా. మ‌గ‌ధీర‌లో చ‌ర‌ణ్ చేసిన క‌త్తియుద్ధం, ఆ విజువ‌ల్ ఎఫెక్ట్ - అక్క‌డ వారిని ఆక‌ట్టుకొంటున్నాయ‌ట‌. దాంతో..

చెర్రీని అభిమానించే వారి సంఖ్య పెరిగింద‌క్క‌డ‌. 
మ‌గ‌ధీర క్రేజ్‌ని ఓ జ‌పాన్ బిస్కెట్ కంపెనీ క్యాష్ చేసుకోవాల‌ని చూస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ ల‌వ్ క్రీమ్ బిస్కెట్స్ అంటూ ప్రచారం చేసుకొంటోంది. తుఫాన్, ఎవడు సినిమాలు కూడా అక్క‌డ విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: