ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా మారాడు. ఇది వ‌ర‌కు రెండేళ్ల‌కో సినిమా చొప్పున తీస్తుండేవాడు. ఇప్పుడు మాత్రం ఒక సినిమా సెట్స్‌లో ఉండ‌గానే, మ‌రో సినిమా గురించి ఆలోచిస్తున్నాడు. అత్తారింటికి దారేది ఇప్పుడు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈలోగా గ‌బ్బ‌ర్ సింగ్ 2 ప‌నుల‌న్నీ జ‌రిగిపోతున్నాయి. ఈ సినిమా స్ర్కిప్టు సిద్ధ‌మైంది. ఇప్పుడు క‌థానాయిక‌నీ ప‌ట్టేశారు.ఈ సినిమా కోసం స‌మంత‌, కాజ‌ల్‌ల పేర్లు ప‌రిశీలించారు.

అయితే కాల్షీట్ల స‌మ‌స్య వ‌ల్ల వాళ్లు ఒప్పుకోలేదు. దాంతో బాలీవుడ్ భామ‌ను ప‌ట్టుకురావాల‌ని నిర్ణయించారు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న సోనాక్షీ సిన్హా క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని స‌మాచార‌మ్. ఇప్ప‌టికే ఆమెకు క‌థ వినిపించార‌ట‌. దానికి సోనాక్షి కూడా అంగీకారం చెప్పింద‌ని స‌మాచార‌మ్‌.ఒక‌వేళ సోనాక్షి కి వీలుకాక‌పోతే....

స‌మంత‌, కాజ‌ల్‌ల‌లో ఒక‌రిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ సినిమా కోసం ఒప్పించ‌డానికి ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. షూటింగ్ మొద‌లైన త‌ర‌వాత క‌థానాయిక‌ను వెదుక్కోవ‌డం కంటే.. ముందే సెట్ చేసుకోవ‌డం మంచిద‌ని ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది భావిస్తున్నాడు. అందుకే అత్తారింటికి దారేది పూర్త‌య్యేలోగా క‌థానాయిక‌ను సెట్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ఆగ‌స్టు ఆఖ‌రి వారంలో గ‌బ్బ‌ర్ సింగ్ 2 సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: