మద్రాసు పట్టణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్. సౌత్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. తెలుగులో ఎవడులో కనిపించి మురిపించిన ఈ సుందరి ఇప్పుడు వచ్చిన డబ్బులను ఆదా చేసే మార్గంలో ఓ బిజిబెస్ స్టార్ట్ చేయబోతుందట.


ఇంతకీ అమీ స్టార్ట్ చేయబోయే బిజినెస్ ఏది అంటే హోటల్ బిజినెస్ అని అంటున్నారు. ప్రపంచ దేశాలన్ని తిరిగి రుచి కరమైన వంటలాకల్ను టేస్ట్ చేసిన అమీ జాక్సన్ అన్నిటిని ఒకే చోట అందుబాటులో ఉండేలా తానో రెస్టారెంట్ పెట్టాలని నిర్ణయించుకుందట. ఇందుకు తనతో పాటు తన మదర్, సోదరి సహకరిస్తారని అంటుంది.     


టాప్ హీరోయిన్ గా కాకపోయినా సినిమాల్లో అమ్మడు ఆదాయం ఓ రేంజ్ లో ఉంది. పారితోషికానికి తగ్గ అందాలను ప్రదర్శించే అమ్మడు ఇప్పటికి క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం రోబో సీక్వల్ గా వస్తున్న 2.0లో హీరోయిన్ గా నటిస్తున్న అమీ జాక్సన్ మిగతా సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయి. తమిళంలో స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫాంలో ఉన్న అమీ జాక్సన్ త్వరలో స్టార్ట్ చేయనున్న ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: