మహేష్ బాబు కెరీర్ లో అతిగొప్ప సినిమా అంటే పోకిరి తరవాత ఒక్కడు అనే చెప్పాలి. మహేష్ ఫాన్స్ కి ఈ చిత్రం గురించి తలచుకుంటే చాలు రోమాలు నిక్క బోడుచుకుంటాయి. మహేష్ కెరీర్ ని మలుపు తిప్పి అత్యవసరం అయిన స్టార్ స్టేటస్ ని అందించింది ఈ చిత్రం మహేష్ కి హిట్ సినిమాలు ఉన్నా కూడా కావాల్సిన టైం లో మాస్ కే కాక యూత్ కి కూడా దగ్గర చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చిన చిత్రం ఇది. తమిళ్ లో కూడా దీన్ని రీమేక్ చేసి గిల్లీ అనే పేరుతో అక్కడ వదిలారు .


విజయ్ హీరోగా చేసిన ఈ సినిమాకి ధరణి డైరెక్షన్ చేసాడు. త్రిష హీరోయిన్.పవన్ కళ్యాణ్ తో బంగారం మూవీ చేసిన దర్శకుడు కూడా ఇతనే. రీసెంట్ గా ఈ ధరణి ఓ ఆసక్తి కరమైన విషయం చెప్పాడు. తాను గిల్లి చిత్రానికి సీక్వెల్ చేయాలని భావించడమే కాదు.. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసేశాడట. విజయ్ ఈ స్క్రిప్ట్ ని వినేసాడు అనీ విజయ్ ఓకే అంటే ఈ సినిమా సెట్స్ మీదకి తీసుకుని వెళ్తా అంటున్నాడు ఈ డైరెక్టర్.


అయితే.. ఒక్కడు ఒరిజినల్ రాసిన గుణ శేఖర్ కి మాత్రం అలాంటి ఆలోచనలు ఏమీ ఉన్నట్లుగా లేవు. రీమేక్స్ ని ఇష్టపడని మహేష్ బాబు ఒక్కడు 2 ని పారలల్ గా చెయ్యమంటే ఏమంటాడో ?


మరింత సమాచారం తెలుసుకోండి: